నాగబాబుకు కరోనా పాజిటివ్..

  • IndiaGlitz, [Wednesday,September 16 2020]

నిర్మాత, నటుడు నాగబాబుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కొద్ది రోజులుగా కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఆయన కరోనా పరీక్ష చేయించుకోగా.. పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని నాగబాబు ఇన్‌స్టా వేదికగా వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆయన ఒక సోషల్ మెసేజ్ కూడా ఇచ్చారు. ఒక వ్యాధి వచ్చిందని.. బాధ పడటం కాదని.. దాని నుంచి కోలుకుని మరొకరికి సాయం చేయాలని సూచించారు. తాను కరోనా నుంచి కోలుకున్న అనంతరమే ప్లాస్మా దానం చేస్తానని ఈ సందర్భంగా నాగబాబు వెల్లడించారు.

‘‘ఒక వ్యాధి వచ్చిందని బాధగా ఉండటం కాదు.. దాని నుంచి కోలుకుని వేరొకరికి సాయం చేయాలి. కోవిడ్ 19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. సరైన జాగ్రత్తలు పాటించి కరోనాని జయించి.. ప్లాస్మా దాతగా మారతాను’’ అని నాగబాబు వెల్లడించారు. నాగబాబు పోస్టు చూసిన అభిమానులు, పలువురు నెటిజన్లు ఆయన త్వరగా కోలుకోవాలంటూ పోస్టులు పెడుతున్నారు.

More News

తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మృతి

చిత్తూరు జిల్లా తిరుపతి వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కన్నుమూశారు. కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో ఆయన..

`ఖైదీ` ద‌ర్శ‌కుడితో క‌‌మ‌ల్ కొత్త సినిమా..!

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్‌హాస‌న్ కొత్త సినిమాను బుధ‌వారం అధికారికంగా ప్ర‌క‌టించారు. `ఖైదీ`తో సెన్సేష‌న‌ల్ హిట్ కొట్టిన లొకేష్ క‌న‌రాజ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు.

మాన‌వ‌త్వం ఇంకా ఉంద‌నే న‌మ్మ‌కం రెట్టిపైంది:  చిన్మ‌యి

మీటూ ఉద్యమాన్ని సౌత్ సినిమా ఇండ‌స్ట్రీలో లీడ్ చేసిన సింగ‌ర్ చిన్మ‌యి.. లాక్‌డౌన్ స‌మ‌యంలో త‌న దాతృత్వాన్ని చాటుకున్నారు.

మ‌హేశ్ 27.. ప్యాన్ ఇండియా మూవీనా..?

ఇప్పుడు తెలుగు స్టార్స్ అంద‌రూ ప్యాన్ ఇండియా హీరోలుగా ప్రూవ్ చేసుకోడానికి స‌న్నాహాలు చేసుకుంటున్నారు.

ఎస్పీబీ ఆరోగ్య పరిస్థితిపై తాజా అప్‌డేట్..

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం క్రమక్రమంగా మెరుగుపడుతోంది. కరోనా కారణంగా చికిత్స నిమిత్తం ఆయన చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే.