close
Choose your channels

జనసేనలోకి నాగబాబు.. ఎంపీగా పోటీ

Wednesday, March 20, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఇన్ని రోజులు సోషల్ మీడియా ద్వారా తన గొంతును వినిపిస్తూ వచ్చిన ప్రముఖ నటులు, మెగా బ్రదర్ నాగబాబు నేడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. నేడు ఆయన జనసేన పార్టీలో చేరారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో ఆయన జనసేన పార్టీ కండువా కప్పుకున్నారు.

ఈ ఎన్నికల్లో నాగబాబు నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. టీడీపీతో పాటు వైసీపీ అన్ని స్థానాలకూ అభ్యర్థులను ప్రకటించడంతో ఇప్పుడు టికెట్ ఆశావహుల చూపు జనసేనపై పడింది. దీంతో జనసేనలో చేరికలు భారీగా పెరిగాయి.

తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు బైరబోయిన శ్రీనివాస్ జనసేనలో చేరారు. విజయవాడలో పవన్ తమ పార్టీ కండువా కప్పి శ్రీనివాస్‌ను జనసేనలోకి ఆహ్వానించారు.

అలాగే గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే శ్రీ మధుసూదన్ గుప్తా కూడా నేడు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. విజయనగరం లోక్ సభ స్థానం జనసేన అభ్యర్థిగా ముక్కా శ్రీనివాసరావు ను ఖరారు చేశారు. విజయవాడలో పవన్ కళ్యాణ్ గారు అభ్యర్థికి బి ఫారం అందచేశారు

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.