close
Choose your channels

మ‌రోసారి గాంధీజీపై సెన్సేష‌న‌ల్ ట్వీట్ చేసిన నాగ‌బాబు

Saturday, May 23, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మ‌రోసారి గాంధీజీపై సెన్సేష‌న‌ల్ ట్వీట్ చేసిన నాగ‌బాబు

మెగాబ్ర‌ద‌ర్ నాగ‌బాబు ట్విట్ట‌ర్ వేదికగా సెన్సేష‌న్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇటీవ‌ల ఆయ‌న నాధూరాం గాడ్సేకు అనుకూలంగా చేసిన ట్వీట్స్‌పై పెద్ద దుమార‌మే రేగింది. కాంగ్రెస్ నాయ‌కులు నాగ‌బాబుపై కేసు కూడా పెట్టారు. ఈ దుమారం త‌గ్గ‌క ముందే మ‌రోసారి గాంధీజీపై నాగ‌బాబు మ‌రో సెన్సేష‌న‌ల్ ట్వీట్ చేశారు. క‌రెన్సీ నోట్ల‌పై గాంధీజీ బొమ్మ‌నే ఎందుకు ఉండాలి? అనే దానిపై నాగ‌బాబు చేసిన కామెంట్స్ సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వివ‌రాల్లోకెళ్తే..ఇండియన్ కరెన్సీ నోట్ల మీద సుభాష్ చంద్ర బోస్,అంబేద్కర్, భగత్ సింగ్,చంద్ర శేఖర్ ఆజాద్,లాల్ బహదూర్ ,పీవీ నరసింహారావు,అబ్దుల్ కలాం,సావర్కార్,వాజపేయ లాంటి మహానుభావుల చిత్రాలను కూడా చూడాలని ఉంది. ఎందుకంటే స్వతంత్ర భారత ఆవిర్భావానికి కృషి చేసిన మహానుభావులని జనము మర్చిపోకూడదని ఒక ఆశ. గాంధీ గారు బ్రతికి ఉంటే ఆయన కూడా తనతో పాటు దేశానికి సేవ చేసిన దేశభక్తులని గౌరవించమని తప్పకుండా చెప్పేవారు.దేశం కోసం జీవితాల్ని త్యాగం చేసిన మహానుభావుల పేర్లు తప్ప మొహాలు గుర్తు రావడం లేదు.భావితరాలకు కరెన్సీ నోట్ల పై వారి ముఖ పరిచయం చెయ్యాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది’’ అంటూ నాగ‌బాబు చేసిన ట్వీట్స్‌పై ఎవ‌రెలా స్పందిస్తారో చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.