నాగ్, ధనుష్ మల్టీస్టారర్

  • IndiaGlitz, [Tuesday,January 16 2018]

టాలీవుడ్ సీనియ‌ర్ స్టార్ హీరో నాగార్జున అక్కినేని ప్ర‌స్తుతం రామ్ గోపాల్ వ‌ర్మ చిత్రంలో న‌టిస్తున్నాడు. ఈ సినిమా ముగియగానే శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో ఓ మ‌ల్టీస్టార‌ర్ న‌టించ‌బోతున్నాడు. ఇందులో నాగార్జునతో నాని న‌టించ‌బోతున్నాడు. అంత‌కుముందుగానే నాగార్జున 'ఊపిరి' చిత్రంలో కలిసి న‌టించాడు. ఇప్పుడు మ‌రో త‌మిళ హీరోతో క‌లిసి న‌టిస్తాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఆ హీరో మ‌రెవ‌రో కాదు ధ‌నుష్‌. ఈ చిత్రాన్ని ధ‌నుష్ నిర్మిస్తాడ‌ట‌. ఈ విష‌య‌మై ధ‌నుష్ ఇటీవ‌ల హైద‌రాబాద్ వ‌చ్చి నాగ్‌ను క‌లిశాడ‌ని..నాగ్ కూడా పాజిటివ్‌గానే స్పందించాడ‌నేది టాక్‌.

More News

'భ‌ర‌త్ అను నేను' ఫ‌స్ట్ లుక్ డేట్‌...

ర‌చ‌యిత నుంచి ద‌ర్శ‌కుడిగా మారిన కొరటాల శివ.. వ‌రుస విజ‌యాల‌తో అన‌తి కాలంలోనే టాప్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్నారు. మిర్చి, శ్రీ‌మంతుడు, జ‌న‌తా గ్యారేజ్.. ఇలా ఇప్ప‌టి వ‌ర‌కు స్టార్ హీరోల‌తోనే త‌న సినిమాల‌ను చేసిన శివ‌.. త‌న నాలుగో చిత్రాన్ని కూడా మ‌రో స్టార్ హీరోతో చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

ప్ర‌పంచ అంద‌గాడుగా హృతిక్‌...

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోష‌న్‌ను గ్రీక్ గాడ్ అని ఆయ‌న అభిమానులు సంబోధిస్తుంటారు. చ‌క్క‌ని రూపం, మంచి న‌ట‌న ఆయ‌న సొంతం.

'రంగ‌స్థ‌లం' టీజ‌ర్ వ‌చ్చేస్తుంది...

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా మైత్రీ మూవీ మేక‌ర్స్ ప‌తాకంపై రూపొందుతున్న‌ భారీ చిత్రం 'రంగ‌స్థ‌లం'. స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో న‌వీన్ ఎర్నేని, వై.ర‌విశంక‌ర్‌, మోహ‌న్‌(సి.వి.ఎం) నిర్మాత‌లు ఈ ప్రెస్టీజియ‌స్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  మార్చి 30న సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతుంది.

'వైఫ్ ఆఫ్ రామ్' గా మంచు లక్ష్మి

కంటెంట్ ఉన్న సినిమాలతో అలరించే నటి మంచు లక్ష్మి. తండ్రికి తగ్గ తనయగా, బెస్ట్ యాక్ట్రెస్ గా ప్రూవ్ చేసుకున్న మంచు లక్ష్మి మరోసారి ఓ సరికొత్త కాన్సెప్ట్ తో రాబోతోంది. చాలా రోజులు క్రితమే షూటింగ్ ప్రారంభించుకున్న ఈ మూవీ టైటిల్ ను సంక్రాంతి సందర్భంగా ప్రకటించారు.

'మిఠాయి' ప్రారంభం

డార్క్ కామెడీ నేపథ్యంలో రూపొందుతున్న కొత్త చిత్రం 'మిఠాయి'.