కింగ్ అక్కినేని నాగార్జున చేతుల మీదుగా 'నరుడా..!డోనరుడా...!' ఫస్ట్ లుక్ విడుదల

  • IndiaGlitz, [Monday,September 19 2016]

హీరో సుమంత్ కథానాయ‌కుడుగా రూపొందుతోన్న కొత్త చిత్రం నరుడా..! డోన‌రుడా..! ఫ‌స్ట్ లుక్‌ను అక్కినేని నాగార్జున విడుద‌ల చేశారు. ఫ‌స్ట్‌లుక్‌లోని విల‌క్ష‌ణ‌త వ‌ల్ల ఫ‌స్ట్‌లుక్‌కు ఆడియెన్స్ నుండి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అన్న‌పూర్ణ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణ‌లో ర‌మా రీల్స్‌, ఎస్‌.ఎస్‌.క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్‌పై సంయుక్తంగా ఈ చిత్రం రూపొందుతోంది.ఈ సినిమాతో ప‌ల్ల‌వి సుభాష్ హీరోయిన్‌గా తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అవుతుంది. త‌నికెళ్ళ‌భ‌ర‌ణి ఈ చిత్రంలో ప్ర‌ముఖ పాత్ర‌ను పోషిస్తున్నారు.

గోల్కొండ హైస్కూల్‌, ఊహ‌లు గుస‌గుస‌లాడే చిత్రాల‌కు అసోసియేట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేసిన మ‌ల్లిక్‌రామ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. క్ష‌ణం వంటి సూప‌ర్‌హిట్ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీని అందించిన ష‌నీల్ డియో ఈ సినిమా సినిమాటోగ్ర‌ఫీని అందిస్తుండ‌గా, క్ష‌ణం, గుంటూర్ టాకీస్ వంటి చిత్రాల‌కు సంగీతాన్ని అందించిన శ్రీచ‌ర‌ణ్ పాకాల సంగీతాన్ని స‌మ‌కూరుస్తున్నారు. కిట్టు విస్సాప్ర‌గ‌డ, సాగ‌ర్ రాచ‌కొండ‌ మాట‌లు అందిస్తున్నారు. వై.సుప్రియ‌, జాన్ సుధీర్ పూదోట ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంలో శ్రీల‌క్ష్మి, సుమ‌న్ శెట్టి, భ‌ద్ర‌మ్‌, జ‌బ‌ర్‌ద‌స్త్ శేషు, సుంక‌ర‌ల‌క్ష్మి, పుష్ప‌, చ‌ల‌ప‌తిరాజు ఇత‌ర తారాగ‌ణంగా న‌టించారు.

More News

మోహ‌న్‌లాల్ మూవీలో క‌మ‌ల్‌హాస‌న్‌....?

మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ మోహ‌న్‌లాల్ హీరోగా రూపొందిన `ఓప‌మ్` మూవీ రీసెంట్‌గా మ‌ల‌యాళం బాక్సాఫీస్ వ‌ద్ద సూప‌ర్‌హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది.

సూర్య 'ఎస్-3' (సింగం 3) రిలీజ్ డేట్

సూర్య,హరి సూపర్ హిట్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా వివరించనక్లర్లేదు.

డి.వి.సినీ క్రియేషన్స్ బ్యానర్ పై అక్టోబర్ లో జీవా, కాజల్ చిత్రం

'రంగం' వంటి సూపర్ హిట్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు సుపరచితుడైన జీవా హీరోగా,కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా

క‌త్రినాకు వ‌ర్మ స‌పోర్ట్‌....

బాలీవుడ్ అగ్ర‌తార క‌త్రినా కైఫ్‌కు స్మితాపాటిల్ అవార్డును ప్ర‌క‌టించిన సంగ‌తి విదిత‌మే. అయితే దీనిపై అసంతృప్తితో ఉన్న కొంత మంది నెటిజ‌న్లు క్ర‌తినాపై విమ‌ర్శ‌లు గుప్పించారు. అయితే క‌త్రినాపై వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌కు రాంగోపాల్ వ‌ర్మ రీ కౌంట‌ర్ ఇవ్వ‌డం పెద్ద షాక్ అయ్యింది.

త‌మ్ముడి నిర్మాత‌ల‌తో అన్న‌

కార్తీ హీరోగా గోకుల్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం కాష్మోరా. ఈ సినిమాను నిర్మిస్తున్న డ్రీమ్ వారియ‌ర్స్ బ్యాన‌ర్స్ అధినేత ఎస్‌.ఆర్‌.ప్ర‌భు ఇప్పుడు కార్తీ అన్న‌య్య సూర్య‌తో కూడా సినిమా ప్లాన్ చేస్తున్నాడు.