close
Choose your channels

హైద‌రాబాద్‌లో కింగ్ నాగార్జున 'మ‌న్మ‌థుడు 2' కొత్త షెడ్యూల్‌

Tuesday, May 21, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

హైద‌రాబాద్‌లో కింగ్ నాగార్జున మ‌న్మ‌థుడు 2 కొత్త షెడ్యూల్‌

కింగ్‌, నాగార్జున‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ జంట‌గా న‌టిస్తున్న చిత్రం 'మ‌న్మ‌థుడు 2'. రీసెంట్‌గా నెల‌పాటు పోర్చుగ‌ల్‌లో లాంగ్ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ జ‌రిగింది. మ‌న్మ‌థుడు 2 ఇన్‌స్పిరేష‌న్‌తో మ‌న్మ‌థుడు 2 చిత్రాన్ని లాఫింగ్ రైడ‌ర్‌గా రూపొందిస్తున్నారు.

నాగార్జున‌, ర‌కుల్ ప్రీత్ సింగ్‌, వెన్నెల‌కిషోర్‌, రావు ర‌మేష్ స‌హా న‌టీన‌టులంద‌రూ పాల్గొనగా ఈ సినిమాకు సంబంధించి పోర్చుల్ షెడ్యూల్‌ను చిత్ర యూనిట్ రీసెంట్‌గా పూర్తి చేసింది. త్వ‌ర‌లోనే కొత్త షెడ్యూల్‌ను హైద‌రాబాద్‌లో చిత్రీక‌రించ‌నున్నారు.

రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ ఫ‌న్ రైడ‌ర్ తెర‌కెక్కుతోంది. చైత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి ఎం.సుకుమార్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. మ‌నం ఎంట‌ర్‌ప్రైజ‌స్‌, ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్‌, వ‌యాకామ్ 18 మోష‌న్ పిక్చ‌ర్స్ ప‌తాకాల‌పై నాగార్జున అక్కినేని, పి.కిర‌ణ్ (జెమిని కిర‌ణ్‌) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.