సోగ్గాడు కు భారీ స్వాగ‌తం

  • IndiaGlitz, [Thursday,April 21 2016]

మనం, సోగ్గాడే చిన్ని నాయ‌నా, ఊపిరి..చిత్రాల‌తో హ్యాట్రిక్ సాధించిన నాగార్జున తాజాగా నిర్మ‌లా కాన్వెంట్ అనే చిత్రంలో న‌టిస్తున్నారు.ఈ చిత్రాన్ని అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్ పై నాగార్జున నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ కోసం నాగార్జున తూర్పు గోదావ‌రి జిల్లా వెళ్లారు. తిమ్మాపురం, అచ్చంపేట‌, పండూరు గ్రామాల్లో అభిమానులు సోగ్గాడుకు భారీగా స్వాగ‌తం ప‌లికారు. డైరెక్ట‌ర్ క‌ళ్యాణ్ కృష్ణ సోద‌రుడు, మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్దఎత్తున అచ్చంపేట జంక్షన్‌కు చేరుకున్నారు.

నాగార్జున రాజమండ్రి నుంచి సామర్లకోట మీదుగా అచ్చంపేట జంక్షన్‌కు రాగానే అభిమానులు పెద్ద ఎత్తున నాగార్జున‌ను చుట్టుముట్టారు. ఈ సంద‌ర్భంగా నాగార్జున మాట్లాడుతూ.... ఈ ప్రాంతం చాలా అందంగా ఉంది. ఇక్కడి ప్రజలు చూపించే ఆదరణను ఎప్ప‌టికీ మరువలేను అన్నారు. అక్కడి నుంచి అభిమానులతో ఊరేగింపుగా ప్రత్యేక కారులో నాగార్జున, కన్నబాబు పండూరు చేరుకున్నారు. పండూరులో నాగార్జున‌ నిర్మలా కాన్వెంట్ చిత్రం షూటింగ్‌లో భాగంగా ఉచిత వైద్యశిబిరాన్ని ప్రారంభించే సన్నివేశాలను చిత్రీకరించారు.

More News

సమంతకు అక్కడ కొత్త రికార్డ్

హీరోయిన్ సమంత తమిళనాట కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. అదేంటని అనుకుంటున్నారా...రెండు వందకోట్ల కలెక్షన్స్ ఉన్న సినిమాల్లో హీరోయిన్ గా నటించడం. అందులో ఆ రెండు సినిమాల్లోనూ హీరోగా విజయ్ నటించడం.

నితిన్ కు సర్దార్ స్వీట్ షాక్...

హీరో నితిన్,పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు పెద్ద అభిమాని.ఈ విషయాన్ని నితిన్ బాహాటంగానే చెప్పుకుంటాడు.అలాగే నితిన్ అంటే పవన్ కు కూడా ఇష్టమే.

జనతా గ్యారేజ్ ఫస్ట్ లుక్ డేట్...

యంగ్ టైగర్ ఎన్టీఆర్,కొరటాల శివ కాంబినేషన్ లో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రం జనతా గ్యారేజ్.

పూరికి వ్యతిరేకంగా తేజ....

పూరి జగన్నాథ్ - లోఫర్ డిస్ట్రిబ్యూటర్స్ వివాదం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది.సినిమా అనేది కళాత్మకమైన వ్యాపారం.

'కబాలి' రిలీజ్ డేట్ మళ్లీ మారింది....

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో కలైపులి థాను నిర్మిస్తున్న చిత్రం 'కబాలి'.ప్రస్తుతం సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది.