కింగ్ నాగార్జున విడుదల చేస్తున్న హీరో తరుణ్ 'ఇది నా లవ్ స్టోరీ' టీజర్

  • IndiaGlitz, [Thursday,May 04 2017]

అభిరామ్ స‌మ‌ర్ప‌ణ‌లో రామ్ ఎంట‌ర్‌టైన‌ర్స్ బ్యాన‌ర్‌పై త‌రుణ్‌, ఓవియా హీరో హీరోయిన్లుగా రమేష్‌, గోపి ద‌ర్శ‌క‌త్వంలో ఎస్‌.వి.ప్ర‌కాష్ నిర్మిస్తోన్న చిత్రం 'ఇది నా ల‌వ్‌స్టోరీ'. ప్ర‌స్తుతం సినిమా నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల తుది ద‌శ‌కు చేరుకుంది. ఈ సినిమా టీజ‌ర్ విడుద‌ల‌ను రేపు సాయంత్రం కింగ్ నాగార్జున విడుద‌ల చేస్తున్నారు.

క‌న్న‌డంలో సూప‌ర్‌హిట్ అయిన చిత్రాన్ని తెలుగులో 'ఇది నా ల‌వ్‌స్టోరీ' అనే పేరుతో రీమేక్ చేశాం. ఒక అబ్బాయి త‌న‌కు న‌చ్చిన అమ్మాయిని ఎంత ప్రేమించాడ‌నేదే సినిమా కాన్సెప్ట్‌. తెలుగు ఆడియెన్స్ టెస్ట్‌కు త‌గిన విధంగా, నెటివిటీకి అనుగుణంగా క‌థ‌లో మార్పులు చేర్పులు చేశాం. అవుటండ్ అవుట్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమా చాలా బాగా వ‌చ్చింది. త‌రుణ్, ఓవియా అద్భుతంగా న‌టించారు. ఈ సినిమా టీజ‌ర్‌ను కింగ్ నాగార్జున రేపు విడుద‌ల చేస్తున్నారు. మా టీంకు నాగార్జున వంటి స్టార్ హీరో ఆశీస్సులు అందించ‌డం అదృష్టంగా భావిస్తున్నాం. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను త్వ‌ర‌లోనే విడుద‌ల చేస్తామ‌ని చిత్ర ద‌ర్శ‌క నిర్మాత‌లు తెలిపారు.

More News

మే12న ప్రపంచ వ్యాప్తంగా 'వెంకటాపురం' విడుదల

గుడ్ సినిమా గ్రూప్ పతాకంపై శ్రేయాస్ శ్రీనివాస్ &తుము ఫణి కుమార్ నిర్మాతలుగా తెరకెక్కుతోన్న సస్పెన్స్ థ్రిల్లర్ వెంకటాపురం.

నారా రోహిత్, శ్రీయా శరణ్, శ్రీవిష్ణు, సత్యదేవ్ కాంబినేషన్ లో మల్టీస్టారర్ చిత్రం 'వీర భోగ వసంత రాయలు'

2016 చివరలో విడుదలై సినీప్రేక్షకుల్ని, విమర్శకులని సైతం మనసుతో కంటతడి పెట్టించిన వినూత్నకథా చిత్రం అప్పట్లో ఒకడుండేవాడు. ఈ చిత్రంలో నారారోహిత్, శ్రీవిష్ణు కలసి నటించారు.

ఆర్భాటంగా గల్ఫ్ ప్రచార చిత్రాల విడుదల

పి. సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వం వహించిన గల్ఫ్ చిత్రం వచ్ఛే నెల జూన్ లో విడుదల కు పరుగులు పెడుతోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు గల్ఫ్ ప్రచార చిత్రాలని విశాఖపట్నంలో ఆర్భాటంగా విడుదల చేసారు.

జాతీయ అవార్డులు ప్రధానం..ఫాల్కే పురస్కారం అందుకున్న కళాతపస్వి..

తెలుగు సినిమాకు సరికొత్త అర్థాలు చెబుతూ సినిమాలు తీసిన కళాతపస్వి కె.విశ్వనాథ్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ

నటి భావనకు పెళ్ళి ఖరారైంది..

తెలుగులో ఒంటిరి,మహాత్మ సినిమాలను చేసిన భావన ఇటీవల కిడ్నాప్,లైంగిక వేధింపులు కారణంగా వార్తల్లో వ్యక్తిగా నిలిచింది.