బిగ్బాస్కు హోస్ట్గా నాగ్ చేయడం దారుణం!!
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు బిగ్బాస్-3కు టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున హాస్ట్గా వ్యవహరించడం దారుణమని ప్రముఖ నిర్మాత కేతిరెడ్డి జగదాశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు బిగ్బాస్షోలో జరుగుతున్న అశ్లీలతపై తెలంగాణ హైకోర్టులో ఫిల్ దాఖలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. షోలో అశ్లీలతను చూపిస్తున్నారన్నారు. ప్రతీ సీన్ను సెన్సార్ చేసి టెలికాస్ట్ చేయాలని పిల్లో ఆయన కోరారు. బిగ్బాస్ షో పేరుతో మహిళలను కించపరుస్తున్నారని ఆయన ఆరోపించారు.
నాగ్తో పాటు పదిమంది ప్రతివాదులు!
ఇదిలా ఉంటే.. ఈ షో రాత్రి 11గంటల తర్వాత ప్రసారం చేయాలని కేతిరెడ్డి పిటిషన్లో పేర్కొన్నారు. సినిమా లాగే ప్రతీ ఎపిసోడ్ సెన్సార్ చేయాలని పిటిషన్లో పేర్కొన్న ఆయన.. బిగ్బాస్ షో వ్యాఖ్యాత
అక్కినేని నాగార్జునతో పాటు 10 మందిని ప్రతివాదులుగా చేరుస్తూ కేతిరెడ్డి పిల్ దాఖలు చేశారు.
వచ్చే మంగళవారం విచారణ!
ఈ సందర్భంగా పిటిషన్ తరుపు న్యాయవాది శాంతి భూషణ్ రావు మాట్లాడుతూ..
బిగ్బాస్షో లో అశ్లీలతను చూపిస్తున్నారని.. బిగ్బాస్లో సెలక్షన్ పేరుతో మహిళలను కించపరుస్తున్నారని చెప్పుకొచ్చారు. ఈ పిటిషన్ మీద ఒక కమిటీ వేసి షోను సెన్సార్ చేయాలన్నారు. హైకోర్టులో పిల్ దాఖలు చేశాము. ఈ పిటిషన్పై విచారణ వచ్చే మంగళవారం ఉందన్నారు.
మేము కూడా పిటిషన్ వేశాం!!
ఇదిలా ఉంటే వివాదాస్పదంగా మారిన ఈ షోపై యాంకర్ శ్వేతారెడ్డి, గాయత్రీ గుప్తా రిట్ పిటిషన్ దాఖలు చేసినట్లు మీడియాకు వివరించారు. తమను బిగ్బాస్షోలో తీసుకుంటామని చెప్పి అగ్రిమెంట్ చేస్తామని మోసం చేశారని బిగ్బాస్ యాజమాన్యం అసభ్యంగా వేధించారని పిటిషన్ వేస్తున్నట్లు తెలిపారు. బిగ్బాస్ షో పేరుతో నిర్వాహకులు మహిళలను కించపరున్నారని పిటిషన్దారులు తెలిపారు. అయితే ఈ పిటిషన్ గురువారం నాడు విచారణకు రానుంది. అయితే గురువారం నాడు కోర్టు ఏం చెప్పబోతోంది..? ఏమని తీర్పు ఇవ్వబోతోంది..? అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.