నాగ్ వర్సెస్ తమన్నా.. క్షమాపణ చెప్పించిన కింగ్!

  • IndiaGlitz, [Sunday,August 11 2019]

బిగ్‌బాస్ హౌస్‌లో జర్నలిస్టులపై ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే శనివారం నాడు హౌస్‌లోకి ఎంటరైన కింగ్ నాగార్జున తమన్నాపై నాగార్జున తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే జర్నలిస్టులకు చెప్పాలని ఆదేశించి.. దగ్గరుండి మరీ మీడియాకు క్షమాపణలు చెప్పించాడు. కాగా.. శివజ్యోతి అలియాస్ తీన్మార్ సావిత్రితో తమన్నా గొడవ పడిన సందర్భంలో ఆమె జర్నలిస్టులపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. జర్నలిస్టులు అందరూ యాక్టింగ్ చేస్తారని, శివజ్యోతి కూడా యాక్టింగ్ చేస్తోందని, జర్నలిజం ఒక యాక్టింగ్ అని తమన్నా వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న నాగ్ శనివారం నాడు జరిగిన ఎపిసోడ్‌లో క్షమాపణ చెప్పించారు.

‘ఎందుకలా నోరు పారేసుకున్నావ్’ అని నాగ్ ప్రశ్నించడంతో కంగుతిన్న తమన్నా.. తానేం అలా అనలేదని తప్పును కప్పిపుచ్చుకునేందుకు యత్నించింది. దీంతో మరోసారి నాగ్ ఆగ్రహానికి లోను కావాల్సింవచ్చింది. అయితే తమన్నా హౌస్‌లో ఏమేం మాట్లాడిందో అంతా వీడియో క్లిప్‌లో చూపించడంతో ఆమె నోటి నుంచి మాటలు రాలేదు. వీడియో చూసిన తర్వాత ఒకింత తమన్నా నవ్వడంతో..‘ అప్పుడేమో జర్నలిజం ఒక యాక్టింగ్ అని, ఇప్పుడు ముసుముసిగా నవ్వుతున్నావా’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో స్పందించిన తమన్నా.. తాను నవ్వడం లేదని, చేసిన తప్పుకు సిగ్గుపడుతున్నానని చెప్పుకొచ్చింది. ఇలా సుమారు అరగంటపాటు ఈ ఎపిసోడ్‌లో నాగ్-తమన్నా మధ్య డిస్కషనే సరిపోయింది.

More News

రామ్‌చరణ్‌కి అవార్డ్ రావాల్సిందన్న మంచు విష్ణు

మెగాపవర్ స్టార్ నటించిన `రంగస్థలం` తెలుగులో సెన్సేషనల్ హిట్ అయ్యింది. నాన్ బాహుబలి రికార్డులను క్రియేట్ చేసింది. రామ్‌చరణ్ నటన, సుకుమార్ టేకింగ్ సినిమాను మరో రేంజ్‌లో నిలిపాయి.

ఇకపై ఏడాదికి రెండు సినిమాలు చేస్తాను: ప్రభాస్

ప్రభాస్, శ్రద్ధాకపూర్ జంటగా నటిస్తోన్న చిత్రం `సాహో`. ఈ భారీ యాక్షన్ చిత్రం ఆగస్ట్ 30న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. శనివారం ఈ సినిమా ట్రైలర్‌‌ని

వైఎస్ జగన్ 15 కోట్లిచ్చారు.. వైసీపీ అభ్యర్థి షాకింగ్ కామెంట్స్!

ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ కనివినీ ఎరుగని రీతిలో విజయదుందుభి మోగించి.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం విదితమే.

ఘోర దుర్ఘటన... 62 మంది  సజీవ దహనం !

ఆఫ్రికా దేశంలోని టాంజానియాలో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఓ ఆయిల్ ట్యాంకర్ బోల్తాపడింది.

చిన్మయిని ట్రోల్ చేస్తున్న నెటిజన్స్

గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయిని నెటిజన్స్ టార్గెట్ చేశారు. సాధారణంగా మహిళల సాధికారికత గురించి చిన్మయి ఎప్పుడూ సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతుంటుంది.