పాన్ ఇండియా సినిమా నుండి త‌ప్పుకున్న నాగ్‌!!

  • IndiaGlitz, [Monday,March 09 2020]

బాహుబ‌లి, కె.జి.య‌ఫ్ పార్ట్ 1 త‌ర్వాత ద‌క్షిణాది నుండి పాన్ ఇండియా సినిమాలు ఎక్కువగా విడుద‌ల‌వుతున్నాయి. ఆ కోవ‌లో ద‌క్షిణాది నుండి విడుద‌ల‌వుతున్న మ‌రో భారీ పాన్ ఇండియా చిత్రం ‘మ‌ర‌క్కార్‌’. మలయాళ సూపర్‌స్టార్ మోహ‌న్‌లాల్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన ఈ చిత్రం ఈ నెల 26న తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల‌తో పాటు అర‌బిక్‌, చైనీస్‌ల‌లో కూడా విడుద‌ల‌వుతుంది. బారీ బ‌డ్జెట్ చిత్రాన్ని ప్రియ‌ద‌ర్శ‌న్ తెర‌కెక్కించారు. భారీ తారాగ‌ణంగా సునీల్ శెట్టి, కీర్తిసురేశ్‌, క‌ల్యాణి ప్రియ‌దర్శిని, అర్జున్‌, ప్ర‌భు త‌దిత‌రులు ఈ చిత్రంలో న‌టించారు.

కాగా..ఈ సినిమా ద‌ర్శ‌కుడు ప్రియ‌ద‌ర్శ‌న్‌కు మ‌న కింగ్ నాగార్జున‌కు మంచి స్నేహితుడు. ఈయ‌న ద‌ర్శ‌క‌త్వంలోనే నాగార్జున ‘నిర్ణ‌యం’ సినిమా చేశాడు. అంతే కాకుండా ఆయ‌న కుమార్తె క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శినిని త‌న కుమారుడు అఖిల్‌తో హ‌లో చిత్రంతో హీరోయిన్‌గా ప‌రిచ‌యం చేశాడు. ఈ ప‌రిచ‌యంతో ప్రియ‌ద‌ర్శ‌న్‌, నాగార్జున‌ను న‌టించాల‌ని అడ‌గ‌టంతో నాగ్ కూడా ఒప్పుకున్నాడు. అయితే రీసెంట్‌గా విడుద‌లైన ట్రైల‌ర్‌లో నాగ్ ఎక్క‌డా క‌న‌ప‌డ‌నేలేదు. నాగార్జున స్థానంలోనే అర్జున్‌ని తీసుకున్నార‌ని స‌మాచారం. ఈ చిత్రం నుండి నాగ్ త‌ప్పుకున్నార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. అయితే కార‌ణాలు మాత్రం తెలియ‌డం లేదు.

More News

ఏపీ నుంచి ‘పెద్దల’ సభకు వీళ్లే.. పక్కా వ్యూహంతో జగన్!

ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్దల సభకు వెళ్లే అభ్యర్థులను సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఖరారు చేసేశారు.

మీ ప‌ని మీరు స‌రిగ్గా చేయండి.. నా ప‌ని న‌న్ను చేసుకోనివ్వండి: రానా

టాలీవుడ్ విల‌క్ష‌ణ న‌టుడు రానా ద‌గ్గుబాటి ముంబైకి మీడియాకు చెందిన ఓ జ‌ర్న‌లిస్ట్‌పై మండిప‌డ్డారు.

అమృతపై బాబాయ్ శ్రవణ్ షాకింగ్ కామెంట్స్

మారుతీరావు ఆత్మహత్యపై తనకు చాలా వరకు బాబాయ్ శ్రవణ్‌పైనే అనుమానాలున్నాయని అమృత మీడియా ముందు వెల్లడించింది.

వైఎస్ జగన్‌తో టిఎస్సార్ భేటీ.. చేరిక ఎప్పుడో..!

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో ప్రముఖ వ్యాపారవేత్త, కాంగ్రెస్ సీనియర్ నేత టి. సుబ్బిరామిరెడ్డి భేటీ అయ్యారు.

మెగా స‌ర్‌ప్రైజ్ అప్పుడేనా?

మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌తో పాటు మెసేజ్‌ను మిక్స్ చేసి మిర్చి, శ్రీమంతుడు,