మహేశ్ పొలిటికల్ ఎంట్రీపై మాట్లాడుతూ దణ్ణం పెట్టిన నమ్రత
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ సూపర్స్టార్ మహేశ్ బాబు త్వరలోనే రాజకీయాల్లోకి రాబోతున్నారు..? ‘భరత్ అనే నేను’ సినిమాలో సీఎంగా చేసిన రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు..? ఫలానా పార్టీకి సపోర్ట్ చేయబోతున్నారు..? బావ గల్లా జయదేవ్ తరఫున రానున్న ఎన్నికల్లో ప్రచారం చేయబోతున్నారు..? ఇటీవల బావ ఉన్న పార్టీలోకే బాబాయ్ వెళ్లడంతో ఇద్దరి కోసం ప్రచారం చేయబోతున్నారు..? ఇలా పలు రకాలుగా కొద్దిరోజుల నుంచి నెట్టింట్లో.. కొన్ని వెబ్ సైట్లలో వార్తలు ప్రచురితమవుతున్నాయి. అయితే ఈ వ్యాఖ్యలపై మహేశ్ స్పందించిన దాఖలాల్లేవ్. తాజాగా మహేశ్ సతీమణి నమత్ర మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చేసింది. ఫిబ్రవరి 10న మహేశ్-నమ్రతల పెళ్లి రోజు. నేటి వీరిద్దరూ పెళ్లి అనే బంధంపై ఒక్కటై 14 ఏళ్ళు పూర్తైంది. పెళ్లి రోజు సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను నమ్రత పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.
రాజకీయాల్లోకి రారు.. సినిమాలే..!
మహేశ్ రియల్ లైఫ్లో రాజకీయాల్లోకి వస్తారా? అని ప్రశ్నించగా ఇందుకు నమ్రత రెండు చేతులు జోడించి దణ్ణం పెట్టడం గమనార్హం. మహేశ్ను తెరపై చూస్తే చాలని.. ఆయనకు అస్సలు రాజకీయాలంటే ఎలాంటి ఇంట్రెస్ లేదని స్పష్టం చేసింది. అంతేకాదు ప్రస్తుతం ఆయన ఫోకస్ అంతా నటనపైనే పెట్టారని చెప్పుకొచ్చింది. మహేశ్కు మూవీతో మరే విషయం రాదు.. అర్థం కాదని నమ్రత తెలిపింది.
నేను రాను.. నాకు టైమ్ లేదు..!
పోనీ మీరు రాజకీయాల్లోకి వస్తారా అని నమ్రతను ప్రశ్నించగా.. తనకు రాజకీయాలు అర్థం కానే కావని.. రాజకీయాల్లోకి వచ్చేంత టైమ్ తనకు లేదని చెప్పింది. ప్రస్తుతం తాను మహేశ్ భార్యగా, ఇద్దరి పిల్లల తల్లిగా సంతోషంగా జీవితం గడుపుతున్నాను. రాజకీయాల్లోకి వచ్చేందుకు తాను సిద్ధంగా లేనని.. నమ్రత సెలవిచ్చింది. మొత్తానికి చూస్తే ఇప్పటి వరకూ మహేశ్ పొలిటికల్ ఎంట్రీపై ఇప్పటి వరకూ వచ్చిన పుకార్లన్నీ వట్టి మాటలేనని ఫుల్స్టాప్ పెట్టేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.