మంత్రి జూపల్లి ని కలిసిన నమ్రత...

  • IndiaGlitz, [Monday,May 23 2016]

సూపర్ స్టార్ మ‌హేష్ బాబు భార్య న‌మ్ర‌త శిరోద్క‌ర్ ఈరోజు పంచాయితీ రాజ్ శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావును క‌లిసారు. మహేశ్ బాబు తెలంగాణ‌లో సిద్దాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. మహబూబ్ నగర్ జిల్లా కొత్తూరు మండలం సిద్దాపూర్ గ్రామ అభివృద్ధి చేయ‌డం కోసం చేయాల‌నుకుంటున్న కార్య‌క్ర‌మాల పై చ‌ర్చించేందుకు న‌మ్ర‌త మంత్రితో భేటీ అయ్యారు.
ఈ సమావేశంలో మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ టీకే శ్రీదేవి కూడా పాల్గొన్నారు. మంత్రి జూప‌ల్లితో భేటి అనంత‌రం న‌మ్ర‌త మాట్లాడుతూ...సిద్దాపూర్ గ్రామ అభివృద్దికి ప్ర‌ణాళిక‌ల‌ను సిద్దం చేస్తున్నాం. సిద్దాపూర్ ను స్మార్ట్ విలేజ్ గా మార్చుతాం అని తెలియ‌చేసారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో బుర్రిపాలెం గ్రామాన్ని, తెలంగాణ‌లో సిద్దాపూర్ గ్రామాన్ని మ‌హేష్ బాబు ద‌త్త‌త తీసుకుని అభివృద్ది చేస్తుండ‌డం నిజంగా అభినంద‌నీయం.

More News

సూపర్ హిట్ రీమేక్ ఆలోచనలో చైతు....

ప్రేమమ్,సాహసం శ్వాసగా సాగిపో చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానున్న అక్కినేని నాగచైతన్య

నాగార్జునతో విమలారామన్...

అక్కినేని నాగార్జున ప్రధానపాత్రలో త్వరలోనే భక్తిరస చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నారు.

క‌బాలి కొత్త రికార్డ్..

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా యువ ద‌ర్శ‌కుడు రంజిత్ తెర‌కెక్కించిన తాజా చిత్రం క‌బాలి. ఈ చిత్రంలో రజ‌నీకాంత్ స‌ర‌స‌న రాధికా ఆప్టే న‌టించింది. ఇటీవ‌ల రిలీజైన క‌బాలి టీజ‌ర్ సెన్సేష‌న్ క్రియేట్ చేసింది.దీంతో క‌బాలి టీజ‌ర్ సినిమా పై అంచ‌నాల‌ను మ‌రింత పెంచేసింది.

అవి చైతు సినిమాలోకనిపించవట...

అక్కినేని నాగచైతన్య, గౌతమ్ మీనన్ కాంబినేషన్ లో రూపొందుతోన్న లవ్, యాక్షన్ థ్రిల్లర్ చిత్రం సాహసం శ్వాసగా సాగిపో. ఈ చిత్రంలో మంజిమ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది.

నాని నెక్ట్స్ మూవీ డైరెక్టర్ ఎవరంటే....

నేచురల్ స్టార్ నాని ఇప్పుడున్న లెటెస్ట్ జనరేషన్ హీరోస్ విభిన్న చిత్రాలను ఎంపిక చేసుకుంటూ మంచి విజయాలను సాధిస్తున్నాడు.