close
Choose your channels

టాలీవుడ్‌లో మరో ట్రెండ్ సెట్ చేస్తున్న బాలయ్య... నిర్మాతలకు వరం, ఫ్యాన్స్‌కి పండగ

Friday, October 1, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కరోనా వైరస్, లాక్‌డౌ‌న్‌ పుణ్యమా అని ఓటీటీలకు ఎక్కడా లేని ఆదరణ దక్కింది. ఇప్పుడు థియేటర్లను పక్కనబెట్టి ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ రాజ్యమేలే పరిస్దితి వచ్చింది. ఒకరకంగా చెప్పాలంటే ఈ విషయంలో ఇప్పుడు చాలా చోట్ల వివాదాలు నడుస్తున్నాయి. ఇక అసలు విషయంలోకి వెళితే.. నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన రెండు సినిమాలు ఓటిటిలో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. అప్పుడెప్పుడో 17 ఏళ్ల క్రితం ఆయన దర్శకత్వంలో ఆగిపోయిన ‘నర్తనశాల’ సినిమాను శ్రేయాస్ ఏటీటీ ద్వారా గతేడాది దసరా కానుకగా బాలయ్య విడుదల చేశారు. ఇది కేవలం 17 నిమిషాల ఫుటేజ్‌ మాత్రమే. షూటింగ్ అయినంతవరకే ఎడిట్ చేసి రిలీజ్ చేశారు బాలయ్య. ఈ కాస్త నిడివి వున్న సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓటిటిలోనే దాదాపు ఒక కోటి 25 లక్షల రూపాయల కలెక్షన్స్ వచ్చినట్టు సమాచారం. ఈ డబ్బును సేవా కార్యక్రమాలకు విరాళంగా ఇచ్చారు బాలకృష్ణ.

నర్తనశాల మంచి ఫలితాన్ని ఇవ్వటంతో గతంలో రిలీజ్ అవ్వకుండా ఆగిపోయిన రెండు సినిమాలని మళ్ళీ ఇప్పుడు ఇలాగే ఓటీటీ ద్వారా రిలీజ్ చేయాలని చూస్తున్నారు బాలకృష్ణ. అందులో ఒకటి దివంగత కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘విక్రమసింహ భూపతి’ . బాలకృష్ణ , కోడి రామకృష్ణ కాంబినేషన్‌లో ఈ సినిమా ప్రారంభమైంది. దాదాపు 80 శాతం వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే ఈ చిత్ర నిర్మాత చనిపోవడంతో ఈ సినిమా అర్థాంతరంగా ఆగిపోయింది. ప్రస్తుతం ఈ సినిమా రష్‌ని బయటకి తీసి ఎంతవరకు ఎడిట్ అయితే అంతవరకు చేసి విడుదల చేయాలి అనే ఆలోచనలో ఉన్నారు బాలయ్య.

ఇంకోటి బాలకృష్ణ తండ్రి, సీనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ సినిమాను తెరకెక్కించారు. అయితే ఈ సినిమాని తర్వాత హిందీలో కూడా ఎన్టీఆర్ తన స్వీయ దర్శకత్వంలో మళ్లీ రీమేక్ చేశారు. తెలుగు వర్షన్ రిలీజ్ అయినా హిందీ వర్షన్ మాత్రం రిలీజ్ అవ్వలేదు. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయినా ఎన్టీఆర్ ఆ సమయంలో రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల పోస్ట్ ప్రొడక్షన్ లోనే ఈ సినిమాని వదిలేశారు. ఇందులో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ కూడా నటించారు. జూనియర్ ఎన్టీఆర్ బాలనటుడిగా నటించాడు. ఇప్పుడు ఈ సినిమాని కూడా బాలకృష్ణ ఓటిటి కానీ ఏటిటిలో కానీ రిలీజ్ చేయాలనే ఆలోచనలో వున్నారు.

చిత్ర పరిశ్రమ వరకు ఇది చాలా మంచి పరిణామం. ఇదే కనుక జరిగితే గతంలో ఇలాగే మధ్యలో ఆగిపోయిన చాలా సినిమాలు రిలీజ్ బాట పట్టి ఎంతో కొంత సొమ్ము చేసుకుంటాయి. మరి బాలయ్య ఆ రెండు సినిమాలు ఎప్పుడు రిలీజ్ చేస్తారోనని నందమూరి అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.