close
Choose your channels

Nandamuri Balakrishna: కరోనా బారినపడ్డ నందమూరి బాలకృష్ణ.. ఫ్యాన్స్‌కి జాగ్రత్తలు

Friday, June 24, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. వ్యాక్సినేషన్, లాక్‌డౌన్‌, ఇతర చర్యలు చేపట్టి థర్డ్ వేవ్‌ను సులభంగానే తప్పించుకున్నప్పటికీ భారత్‌లో ప్రస్తుతం పరిణామాలు చూస్తే ఫోర్త్ వేవ్ వస్తుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో గడిచిన కొన్ని రోజులుగా కేసులు పెరుగుతున్నాయి. అటు పలువురు ప్రముఖులు కూడా కోవిడ్ బారినపడుతున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి సినీనటుడు , హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేరారు.

పూర్తి ఆరోగ్యంగా వున్నా ఆందోళన వద్దు:

తాజాగా చేయించుకున్న కరోనా పరీక్షల్లో ఆయనకు పాజిటివ్‌‌గా తేలడంతో హోం ఐసోలేషన్‌కు వెళ్లారు. తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని.. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బాలకృష్ణ తెలిపారు. అలాగే గత రెండు రోజులుగా తనని కలిసిన వారు కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని బాలయ్య సూచించారు. అటు బాలకృష్ణకు కోవిడ్ సోకినట్లుగా తెలియడంతో ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు.. బాలయ్య త్వరగా కోలుకోవాలంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.

జోరు మీదున్న బాలయ్య:

ఇక సినిమాల విషయానికొస్తే.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ‘అఖండ’తో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన బాలకృష్ణ జోరుమీదున్నారు. ప్రస్తుతం గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఆయన నటిస్తున్నారు. ఇందులో బాలయ్య సరసన శ్రుతిహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. దీని తర్వాత అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య ఓ సినిమా చేయనున్నారు. దీంతో పాటు ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో ‘అన్‌స్టాపబుల్‌ సీజన్‌-2’తో అలరించేందుకు సిద్ధమవుతున్నారు బాలకృష్ణ

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.