మెగా కాంపౌండ్‌లో నందిని

  • IndiaGlitz, [Saturday,December 07 2019]

మెగా కాంపౌండ్ ఇప్పుడు ప‌ర్ఫెక్ట్ యూనివ‌ర్శిటీలాగా క‌నిపిస్తోంది మేక‌ర్స్ కి. అక్క‌డ ఫ్రెష‌ర్స్ ఉంటారు. సీనియ‌ర్లుంటారు... ప్రొఫెస‌ర్లుంటారు అన్న‌ట్టుంది ప‌రిస్థితి. స‌రైన క‌థ‌తో గేట్ త‌ట్టాలేగానీ, ఆ కాంపౌండ్‌లో ఎక్క‌డో ఎవ‌రికో స‌రిపోక‌మాన‌దంటున్నారు రైట‌ర్స్. ఇప్పుడు లేటెస్ట్ గా ఆ కాంపౌండ్‌లో అడుగుపెడుతోంది నందినిరెడ్డి. రీసెంట్ గా ఓ బేబీ చేసింది నందినీరెడ్డి. ఆ మూవీ ఇచ్చిన స‌క్సెస్‌తో ఇప్పుడు కొత్త క‌థ‌ను సిద్ధం చేసుకుంది నందిని. ఆ గ్యాప్‌లో ల‌స్ట్ స్టోరీస్ వెబ్ సీరీస్‌లో ఒక పార్ట్ ను అమ‌లాపాల్‌, జ‌గ‌ప‌తిబాబు తో డైర‌క్ట్ చేసేసింది.

త్వ‌ర‌లోనే మెగా హీరో వైష్ణ‌వ్ తేజ్‌తో సినిమా చేయ‌నుంద‌ట నందినిరెడ్డి. వైష్ణ‌వ్ ఇప్పుడు ఉప్పెన సినిమాతో బిజీగా ఉన్నాడు. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న మూవీ ఇది. ఈ మూవీ త‌ర్వాత స్వ‌ప్న సినిమాస్ నందిని - వైష్ణ‌వ్ మూవీని రూపొందించ‌నున్నారు. అన్నీ క‌రెక్ట్ గా కుదిరితే పొంగ‌ల్ త‌ర్వాత ఈ మూవీ సెట్స్ మీద‌కు వెళ్తుంద‌ట‌. ప్ర‌స్తుతం నందిని లొకేష‌న్ల వేట‌లో ఉన్నారు.

More News

సోలో... సో బెట‌ర్ అంటున్న ప‌ల్ల‌వి

సాయి ప‌ల్ల‌వి ఇప్పుడు సోలో బ‌తుకే సో బెట‌ర్ అని అంటోందా? య‌స్‌... సాయిప‌ల్ల‌వి ఇప్పుడు అదే రాగాన్ని అందుకుంది.

'పోస్టర్' సినిమా ఫస్ట్ లుక్ విడుదల

శ్రీ సాయి పుష్పా క్రియేషన్స్ బ్యానర్ పై టి యం ఆర్. (TMR) దర్శకుడిగా, విజయ్ ధరన్, రాశి సింగ్, అక్షిత సోనావనే హీరో హీరోయిన్ లుగా

ఉదయం నుంచి తెలుగు రాష్ట్రాల ప్రజలంతా టీవీల ముందే!

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఘటనలోని నిందితులను శుక్రవారం తెల్లావారుజామున పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే.

'డిస్కోరాజా' టీజర్ విడుదల

మాస్ మహారాజ రవితేజ లేటెస్ట్ మూవీ డిస్కోరాజా. ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా బృందం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీ గా ఉంది.

'దిశ' కు ఇది నిజమైన నివాళి: మెగాస్టార్ చిరంజీవి

దిశ సంఘటనలో నిందితులు పోలీసు కాల్పుల్లో మృతిచెందారన్న వార్తను ఉదయం చూడగానే నిజంగా ఇది సత్వర న్యాయం , సహజ న్యాయం  అని నేను భావించాను.