నానితో పాటు విల‌నిజం చూపించనున్న హీరోయిన్

  • IndiaGlitz, [Monday,April 06 2020]

హైద‌రాబాద్‌కు చెందిన అదితిరావు హైద‌రి బాలీవుడ్ హీరోయిన్‌గా ముద్ర వేసుకున్న త‌ర్వాత టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌లు చేయ‌డానికి ఈ అమ్మ‌డు ఆస‌క్తిని చూపుతుంది. తెలుగులో స‌మ్మోహ‌నం, అంత‌రిక్షం వంటి సినిమాల్లో న‌టించింది. ఇప్పుడు నాని జ‌త‌గా వి సినిమాలో న‌టించింది. నాని 25వ చిత్రంగా మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో సుధీర్‌బాబు, నివేదా థామ‌స్ కూడా న‌టిస్తున్నారు. ఉగాది సంద‌ర్భంగా సినిమాను మార్చి 25న విడుద‌ల చేయాల‌నుకున్నారు.

కానీ క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో దేశం లాక్ డౌన్ విధించారు. దీంతో థియేట‌ర్స్ మూత‌ప‌డ్డాయి. షూటింగ్స్ ఆగిపోయాయి. ఈ సినిమాలో నాని విల‌న్‌గా, సుధీర్‌బాబు పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌న‌ప‌డ‌తాడ‌ని వార్త‌లు వినిపిస్తూ వ‌చ్చాయి. నాని విల‌నిజాన్ని ఎక్కువ‌గా చూపించే సినిమా ఇదే అవుతుంద‌ని టాక్‌. తాజా స‌మాచారం మేర‌కు నాని విల‌నిజంతో పాటు అదితిరావు హైద‌రి విల‌నిజాన్ని కూడా తెర‌పై చూడొచ్చున‌ని అంటున్నారు. మ‌రి ఇందులో నిజా నిజాలు తెలియాలంటే మ‌రి కొన్ని రోజులు ఆగాల్సిందే.

More News

‘అల వైకుంఠ‌పుములో’ రీమేక్‌లో ఎవ‌రు న‌టిస్తున్నారో తెలుసా?

ఈ ఏడాది తెలుగు సినిమాకు మంచి ప్రారంభ‌మే ద‌క్కింది. రెండు భారీ చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి చేశాయి. అందులో అల్లు అర్జున్ హీరోగా న‌టించిన అల వైకుంఠ‌పుర‌ములో

ఇండియాలో లాక్‌డౌన్ తప్పనిసరి : కేసీఆర్

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి నేపథ్యంలో యావత్ ఇండియా వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన విషయం విదితమే. ఏప్రిల్-14 వరకూ ఈ లాక్‌డౌన్ ఉండనుంది.

ఇవి తింటే.. కరోనాపై పోరాడొచ్చు!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని అంతం చేసేందుకు అన్ని దేశాలు పోరాడుతున్నాయి. ఇంతవరకూ ఈ వైరస్‌ను చంపేందుకు ఎలాంటి మందు కనుగొనలేకపోయారు.

‘గేమ్‌ చేంజర్‌’ కోసం ట్రంప్ ఫోన్.. మోదీ ఊహించని షాక్

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిపై అగ్రరాజ్యం అమెరికా కూడా పోరాటం చేస్తోంది. ఇప్పటికే సుమారు 9500 పై చిలుకు మరణాలు సంభవించాయి.

అమెరికాలో పులికి కరోనా.. భారత్‌లో హై అలెర్ట్

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మనుషులనే కాదు.. జంతువులనూ వదలట్లేదు. ప్రపంచంలో ఫస్ట్ టైమ్ ఈ మహమ్మారి నాలుగేళ్ల పులికి సోకింది.