'అంటే సుందరానికి'... ఏకంగా ఏడు రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసిన నాని

  • IndiaGlitz, [Friday,February 04 2022]

కోవిడ్ మహమ్మారి కారణంగా వాయిదాపడ్డ సినిమాలన్నీ ఒకదాని వెంట ఒకటి రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి నుంచి మే వరకు భారీ , మధ్యతరహా, చిన్న సినిమాల విడుదలతో బాక్సాఫీస్ కళకళలాడనుంది. ధైర్యం చేసి రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినా ఎప్పుడెలాంటి పరిస్థితులు వస్తాయోనన్న భయంతో రెండు డేట్స్ లాక్ చేసి పెట్టుకుంటున్నారు మేకర్స్.

ఆర్ఆర్ఆర్ విషయంలో తొలుత మార్చి 18, ఏప్రిల్ 28లను అనౌన్స్ చేసిన నిర్మాతలు ఆ తర్వాత మార్చి 25ని ఫిక్స్ చేశారు. అలాగే వపర్‌స్టార్ పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్', వరుణ్ తేజ్ 'గని', రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాలకు కూడా రెండేసి రిలీజ్ డేట్స్ ప్రకటించారు నిర్మాతలు. అయితే నేచురల్ స్టార్ నాని మాత్రం వీరిందరికి భిన్నంగా ఒకటి కాదు... రెండు కాదు ఏకంగా ఏడు రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేశారు.

నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'అంటే సుందరానికి'. ఇందులో రాజారాణి ఫేమ్ నజ్రియా నజిమ్ హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ వై నిర్మిస్తున్నారు. వేసవిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే సమ్మర్‌లో బడా సినిమాలు లైన్‌లో వుండటంతో ఏకంగా ఏడు రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేశారు.

'మీరంతా రెండు మూడు బ్లాక్ చేస్తే... మేము ఏడు చేయకూడదా?' అని నాని అడిగారు. 'ఫుల్ ఆవకాయ సీజన్ బ్లాక్డ్. మెల్లగా డిసైడ్ చేద్దాం' అని స్వయంగా హీరో నాని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు. ఏప్రిల్ 22, 29 .. మే 6, 20, 27 .. జూన్ 3, 10లలో ఏదో ఒక తేదీలో 'అంటే సుందరానికి' ప్రేక్షకుల ముందుకు వస్తుందన్నమాట.

More News

బండ్ల గణేష్ కూతురు చేతుల మీదుగా విడుదలైన 'డేగల బాబ్జీ' లోని "కలలే కన్నానే.." లిరికల్ వీడియో

ఒక వ్యక్తి, ఒకే ప్లేస్లో ఒకే లొకేషన్లో, ఒక్క వ్యక్తి మాత్రమే సినిమా అంతా కనిపిస్తాడు.తెలుగు స్క్రీన్ మీద తొలిసారి సింగిల్ యాక్టర్ తో చేసిన సినిమా ఇది. ఇంకా ఈ సినిమాలో మిగతా క్యారెక్టర్లు ఉన్నా. అయితే,

కాజల్‌కు అరుదైన గౌరవం.. గోల్డెన్ వీసా ఇచ్చిన యూఏఈ

సినీ నటి కాజల్‌కు అరుదైన గౌరవం దక్కింది. అత్యంత అరుదుగా, కొందరు ప్రముఖులకు మాత్రమే ఇచ్చే గోల్డెన్ వీసాను యూఏఈ ప్రభుత్వం కాజల్ అగర్వాల్‌కు అందజేసింది. దీనిపై ఆమె స్పందిస్తూ..

బ్రేకింగ్: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై కాల్పులు

యూపీ ఎన్నికల ప్రచారంలో వున్న హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ కాన్వాయ్‌పై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఆయనకెలాంటి ప్రమాదం జరగలేదు. ఒవైసీ ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లోని ఓ కారు మాత్రం పంక్చరైంది.

పునీత్ కుటుంబాన్ని పరామర్శించిన అల్లు అర్జున్.. ఫోటోను తడుముతూ బన్నీ భావోద్వేగం

కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణం నుంచి ఇంకా చిత్ర పరిశ్రమ, అభిమానులు, సన్నిహితులు కోలుకోలేదు. నిత్యం ఎక్కడో ఒక చోట ఆయన ప్రస్తావన వస్తూనే వుంది.

కొత్త కాన్సెప్ట్ తో వస్తున్న 'సెబాస్టియన్' పి.సి.524

రాజావారు రాణి గారు వంటి సూపర్ హిట్ సినిమాతో హీరోగా పరిచయమై "యస్.ఆర్. కళ్యాణమండపం" సినిమా తో బ్లాక్ బస్టర్ సాదించి ప్రేక్షకులలో మంచి క్రేజ్ తెచ్చుకున్న నటుడు కిరణ్ అబ్బవరం. మంచి కథలను