నాని ‘శ్యామ్ సింగరాయ్’ స్టోరీ ఇదేనట...

  • IndiaGlitz, [Monday,November 23 2020]

నేచురల్ స్టార్ నాని లాక్‌డౌన్ తర్వాత మరింత స్పీడ్‌గా సినిమాలను ఎంపిక చేసుకుని షూటింగ్‌లు కానిచ్చేస్తున్నాడు. ప్రస్తుతం ‘టక్ జగదీష్’ షూటింగ్‌లో ఉన్న నాని.. తరువాత రెండు చిత్రాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ‘టక్ జగదీష్’ తర్వాత నాని 'శ్యామ్‌ సింగరాయ్‌' చిత్రంలో నటించనున్నాడు. రాహుల్‌ సాంస్కృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికర వార్త వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో నాని ద్విపాత్రాభినయం చేయబోతున్నాడని టాక్ నడుస్తోంది.

‘టక్ జగదీష్’ షూటింగ్‌ పూర్తయిన వెంటనే ఏమాత్రం గ్యాప్ లేకుండా ‘శ్యామ్ సింగరాయ్’ను లైన్‌లో పెట్టాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. లాక్‌డౌన్ సమయంలో వచ్చిన గ్యాప్‌ని ఇప్పుడు ఫిల్ చేయాలనే యోచనలో నాని ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కూడా వెయిటింగ్‌లో ఉన్నారు. ఇప్పటికే వివేక్ ఆత్రేయ, నాని కాంబోకు సంబంధించి అఫీషియల్ అప్‌డేట్ కూడా వచ్చేసిన విషయం తెలిసిందే. దీంతో చకచకా సినిమాలను నాని లైన్‌లో పెట్టేస్తున్నాడు.

కాగా.. ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రంలో నాని ద్విపాత్రాభినయం చేయబోతున్నాడని సమాచారం. ఒక పాత్ర 1960కి సంబంధించినదైతే ఒక పాత్ర ప్రస్తుత జనరేషన్‌కు తగినట్టు ఉంటుందని తెలుస్తోంది. పునర్జన్మల నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన కథ సాగుతుందని టాక్. ఈ పునర్జన్మలనేవి కోల్‌కత్తా, హైదరాబాద్‌లతో లింక్ అయి ఉంటాయని తెలుస్తోంది. ఈ చిత్రంలో నాని సరసన సాయి పల్లవి, క్రితిశెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై వెంకట్‌ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.