విలన్ గా నాని

  • IndiaGlitz, [Sunday,June 25 2017]

వ‌రుస విజ‌యాల‌ను సాధిస్తున్న యువ‌క క‌థానాయ‌కుడు నాని. ఇప్పుడు 'నిన్ను కోరి' సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. ట్ర‌యాంగిల్ ల‌వ్ స్టోరీగా సినిమా రూపొందిన ఈ సినిమా జూలై 14న విడుద‌ల కానుంది. ఈ సినిమా త‌ర్వాత నాని దిల్‌రాజు నిర్మాణంలో ఓ సినిమా చేయ‌బోతున్నాడు. అలాగే వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్‌, ఎక్స్‌ప్రెస్ రాజా చిత్రాల ద‌ర్శ‌కుడు మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమా చేయ‌బోతున్నాడు.

మేర్ల‌పాక గాంధీ సినిమాలో నాని డ‌బుల్ రోల్ చేస్తాడ‌ని స‌మాచారం. ఇందులో ఓ రోల్‌కు నెగ‌టివ్ షేడ్ ఉంటుందట‌. గ‌తంలో నాని జెండాపై క‌పిరాజు అనే సినిమాలో కూడా డ‌బుల్ రోల్ చేశాడు. అందులో ఒక రోల్ నెగ‌టివ్ ట‌చ్‌తో సాగి చివ‌ర్లో పాజిటివ్‌గా మారుతుంది. ఇప్పుడు మేర్ల‌పాక గాంధీ నానితో డబుల్ రోల్ మూవీ చేస్తున్నా, ఎలాంటి బ్యాక్ డ్రాప్‌లో సినిమా ఉంటుందోన‌ని చూడాల్సిందే..

More News

'మెంటల్ మదిలో' చిత్రంలోని అరవింద్ కృష్ణ పాత్ర పరిచయం

ప్రపంచ సినిమా స్థాయిలో ఇప్పుడిప్పుడే తెలుగు చిత్రసీమ ఎదుగుతోంది. నిర్మాణం పరంగా కొత్త పుంతలు తొక్కుతోంది. తెలుగు నేటివిటీతో ప్రపంచస్థాయి సినిమాలు తీయవచ్చని ఇప్పుడిప్పుడే అందరూ తెలుసుకొంటున్నారు.

జూన్ 30న గంటా రవి, జయంత్ సి.పరాన్జీల 'జయదేవ్'

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవి హీరోగా శ్రీ లక్ష్మీవెంకటేశ్వర ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై డీసెంట్ డైరెక్టర్ జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత కె.అశోక్కుమార్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న చిత్రం 'జయదేవ్'.

షూటింగ్ పూర్తీ చేసుకున్న ఇదేం దెయ్యం

శ్రీనాద్ మాగంటి, సాక్షి కక్కర్, రచ్చ రవి, కిరాక్ అర్పి , రచన స్మిత్ , రుచి ప్రధాన పాత్రలో .. ఎ వి రమణ మూర్తి సమర్పణలో వి రవివర్మ దర్శకత్వంలో చిన్మయానంద ఫిలిమ్స్ పతాకం పై ఎస్. సరిత నిర్మిస్తున్న చిత్రం 'ఇదేం దెయ్యం'.

రోబో '2.0' ప్రపంచ యాత్ర

సూపర్స్టార్ రజనీకాంత్, గ్రేట్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన 'రోబో' ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మళ్ళీ ఇదే కాంబినేషన్లో రోబో చిత్రానికి సీక్వెల్గా రూపొందుతున్న '2.0' చిత్రంపై భారీ ఎక్స్పెక్టేషన్స్ వున్నాయి.

సంచలనాలు సృష్టిస్తున్న 'నేనే రాజు నేనే మంత్రి' ట్రైలర్

సురేష్ ప్రొడక్షన్స్, బ్లూ ప్లానెట్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "నేనే రాజు నేనే మంత్రి". సురేష్ బాబు-కిరణ్ రెడ్డి-భారత్ చౌదరిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి తేజ దర్శకత్వం వహిస్తున్నారు.