'గ్యాంగ్‌ లీడర్‌' రెండో పాట విడుదల

  • IndiaGlitz, [Thursday,August 15 2019]

నేచురల్‌ స్టార్‌ నాని, వెర్సటైల్‌ డైరెక్టర్‌ విక్రమ్‌ కె.కుమార్‌ కాంబినేషన్‌లో మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌(సివిఎం) నిర్మిస్తున్న విభిన్న చిత్రం 'నాని'స్‌ గ్యాంగ్‌ లీడర్‌'. ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాకి సంబంధించి విడుదలైన ప్రీ లుక్‌కి, ఫస్ట్‌లుక్‌కి, టీజర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇటీవల విడుదలైన ఈ చిత్రంలోని 'రారా.. జగతిని జయించుదాం..' అంటూ సాగే మొదటి పాటకు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా అందర్నీ అలరించడానికి రెడీ అవుతున్న 'నాని'స్‌ గ్యాంగ్‌లీడర్‌' చిత్రంలోని 'వేరే కొత్త భూమిపై ఉన్నానా.. ఏదో వింత రాగమే విన్నానా.. హోయ్‌నా.. హోయ్‌నా..హోయ్‌నా..' అంటూ సాగే రెండో పాటను స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగస్ట్‌ 15న విడుదల చేశారు.

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఒక ప్రధాన పాత్ర ఆర్‌ఎక్స్‌ 100 ఫేమ్‌ కార్తికేయ పోషిస్తున్నారు. ప్రియాంక, లక్ష్మీ, శరణ్య, అనీష్‌ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిశోర్‌, జైజా, సత్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్‌ రవిచందర్‌, సినిమాటోగ్రఫీ: మిరోస్లా కుబా బ్రోజెక్‌, మాటలు: వెంకీ, రచనా సహకారం: ముకుంద్‌ పాండే, పొడక్షన్‌ డిజైనర్‌: రాజీవన్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌: రామ్‌కుమార్‌, ఎడిటింగ్‌: నవీన్‌ నూలి, వి.ఎఫ్‌.ఎక్స్‌.: మకుట, కాస్ట్యూమ్‌ డిజైనర్‌: ఉత్తర మీనన్‌, స్టిల్స్‌: జి.నారాయణరావు, కో-డైరెక్టర్‌: కె.సదాశివరావు, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: శేషు, సి.ఇ.ఓ.: చిరంజీవి(చెర్రీ), నిర్మాతలు: నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ (సివిఎం), కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విక్రమ్‌ కె.కుమార్‌.

More News

లోకేష్‌కు రాఖీ కట్టిన ఊహించని వ్యక్తి!!

అన్నా చెల్లెళ్లు, అక్కాత‌మ్ముళ్ల మ‌ధ్య ఉండే ఆత్మీయ అనుబంధాన్ని గుర్తు చేసుకునే పవిత్రమైన రోజు రాఖీ పౌర్ణమి. ఈ రోజున అక్కలు, చెల్లెళ్లు త‌మ సోద‌రుల‌కు రాఖీల‌ను క‌ట్టి త‌మ‌కు ర‌క్షగా ఉండ‌మ‌ని

జాతీయ జెండా ఎగురేసిన నేచురల్ స్టార్ నాని

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని పంద్రాగస్టు సందర్భంగా జాతీయ జెండా ఎగురేశారు. హైదరాబాద్‌లోని ఫిలింనగర్ కల్చరల్ సెంటర్‌లో జరిగిన స్వాతంత్ర వేడుకల్లో నాని ముఖ్య అతిథిగా పాల్గొని..

తాట తీస్తా.. రాజేంద్రప్రసాద్‌కు పృథ్వీ స్ట్రాంగ్ వార్నింగ్!

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని కలవడానికి తామేం బిజినెస్‌మెన్‌లు కాదని సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ చెప్పుకొచ్చిన విషయం విదితమే. గత కొన్నిరోజులుగా టాలీవుడ్ పెద్దలెవరూ వైఎస్ జగన్‌ను

ఏడాది పూర్తి చేసుకున్న గీత గోవిందం

మెగా నిర్మాత శ్రీ అల్లు అరవింద్ గారి సమర్పణలో GA 2 పిక్చర్స్ పతకం పై సక్సెసఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మించిన సినిమా "గీత గోవిందం". టాలెంటెడ్ డైరెక్టర్ పరుశురాం తెరకెక్కించిన ఈ సినిమా

సీనియర్ బాలీవుడ్ నటి కన్నుమూత

ప్రముఖ సీనియర్ బాలీవుడ్ నటి విద్యా సిన్హా(71)ఈరోజు ముంబైలోని జుహూ హాస్పిటల్‌లో అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా ఈమె గుండె, శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు.