వెంకన్నా.. నీ కొండను నువ్వే కాపాడుకో : నారా లోకేశ్

మే-01న టీటీడీ చైర్మన్, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తోడల్లుడు వైవీ సుబ్బారెడ్డి జన్మదినం. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయన పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. వెంకన్న సన్నిధిలో ఆయన పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. అయితే లాక్‌డౌన్ ఉండటంతో మీరెలా అక్కడ వేడుకలు జరుపుకున్నారు..? మీకు లాక్‌డౌన్ వర్తించదా అంటూ ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా వైవీపై ధ్వజమెత్తారు.

నువ్వే కాపాడుకో సామీ..!

‘ఆపద మొక్కుల వాడా, అనాథ రక్షకా! నీకు పేద, ధనిక అనే తేడా లేదంటారు. వైరస్ వ్యాప్తి చెందుతున్న ఈ కాలంలో సామాన్యులకు నీ దర్శన భాగ్యమే లేదు, కానీ వైస్ తోడల్లుడు సకుటుంబ సమేతంగా వచ్చేసరికి నీ గుడి తలుపులు ఎలా తెరిచారయ్యా!. దేవదేవుడి ఉత్సవాలతో అలరారిన తిరుమల గిరులు నిర్మానుష్యంగా మారినవేళ, నిబంధనలు తుంగలో తొక్కి నీ సన్నిధిలో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం అపరాధం కాదా! ఏడుకొండలే లేవన్నోళ్లు నువ్వున్నావంటే నమ్ముతారా? నీ కొండను నువ్వే కాపాడుకో స్వామీ!’ అని లోకేశ్‌ ట్విట్టర్‌లో రాసుకొచ్చారు. ఈ ట్వీట్‌కు పలువురు నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించగా.. చాలా మంది ఆయనపై దుమ్మెత్తిపోస్తున్నారు. అయ్యా సారూ.. ఆయన టీటీడీ చైర్మన్ అనుమతి ఎందుకు ఉండదు మిడి మిడి జ్ఞానంతో కాదు కాస్త ఆలోచించు అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

More News

కువైట్‌లో ఉంటున్న భారతీయులకు శుభవార్త..

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దీంతో స్వరాష్ట్రాలను వదిలి ఇతరదేశాలకు, రాష్ట్రాలకు వెళ్లిన కార్మికులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఇంటికెళ్లలేక..

‘బొమ్మరిల్లు’ భాస్కర్‌కు బన్నీ బంపరాఫర్..!

లవర్ బాయ్ సిద్ధార్థ్, జెనీలియా నటీనటులుగా వచ్చిన ‘బొమ్మరిల్లు’ చిత్రం ఏ రేంజ్‌లో హిట్టయ్యిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ సినిమా హిట్టయిన తర్వాత సినిమా తెరకెక్కించిన భాస్కర్ తన ఇంటిపేరునే

వైద్యులు సూపర్ హీరోలు.. : మహేశ్ బాబు

కరోనా మహమ్మారిపై ముందుండి ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడుతున్న వైద్యులు, వైద్య సిబ్బందిపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే.

ప్ర‌భాస్ 21... క‌థ సిద్ధం చేసి నాగ్ అశ్విన్‌

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం త‌న 20 సినిమాను పూర్తి చేసే ప‌నిలో బిజీగా ఉన్నాడు. అదే స‌మ‌యంలో త‌న 21వ సినిమాను నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌పై సినిమా చేయ‌డానికి

'ఆచార్య‌'పై కాజ‌ల్ క్లారిటీ..!

మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ఆచార్య‌. కొర‌టాల శివ ద‌ర్శ‌కుడు. నిరంజ‌న్ రెడ్డి, రామ్‌చ‌ర‌ణ్ నిర్మాత‌లు. షూటింగ్ ద‌శ‌లోఉన్న స‌మయంలో క‌రోనా రావ‌డం..ఫ‌లితంగా షూటింగ్ ఆగ‌డం జ‌రిగిపోయాయి.