close
Choose your channels

డైలాగ్స్‌ చెబితే... టీడీపీ చూస్తూ ఊరుకోదు ఖబడ్డార్!

Tuesday, September 10, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

డైలాగ్స్‌ చెబితే... టీడీపీ చూస్తూ ఊరుకోదు ఖబడ్డార్!

వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. మంగళవారం నాడు ట్విట్టర్ వేదికగా తాజా రాజకీయ పరిణామాలపై స్పందించారు. ‘జగన్ గారూ! పవిత్రమైన విద్యాలయాలను కూడా మీ కుల రాజకీయాలతో భ్రష్టుపట్టిస్తున్నారెందుకు? ఎస్వీ యూనివర్సిటీలో అన్ని అర్హతలుండీ, ఆరేళ్ళుగా విధులు నిర్వహిస్తున్న టీచింగ్ అసిస్టెంట్లను ఎందుకు తొలగించారు? మీకు కావాల్సిన ఒక సామాజిక వర్గం కోసం ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అన్యాయం చేస్తారా?

మీ వైసీపీ కార్యకర్తలను అడ్డదారిలో యూనివర్సిటీలోకి పంపించి పునరావాసం కల్పించిన ఈ ఘటనపై విచారణ జరగాలి. ఏ కారణంతో ఉన్నవారిని తీసేసారు? ఏ ప్రాతిపదికన కొత్తవారిని తీసుకున్నారో ప్రజలకు తెలియాలి. అధికారపక్షానికి వ్యతిరేకంగా మాట్లాడితే అంతుచూస్తామంటూ విద్యార్థులను పోలీసులతో బెదిరిస్తారా?

ఏమనుకుంటున్నారు మీరు? మీ ఇష్టానుసారం అక్రమాలు చేస్తుంటే ప్రశ్నించే హక్కు ప్రతి సామాన్యుడికి ఉంది. ఆ హక్కును కాలరాసి, గొంతు నొక్కేస్తాం, అణగదొక్కేస్తాంలాంటి డైలాగులు ప్రజాస్వామ్యంలో చెప్తే... తెలుగుదేశం చూస్తూ ఊరుకోదు ఖబడ్ధార్!’ అంటూ లోకేష్ ట్విట్టర్‌లో రాసుకొచ్చారు. అయితే లోకేష్ వ్యాఖ్యలపై వైసీపీ నుంచి ముఖ్యంగా వైసీపీ ఎంపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.