'టీడీపీ ఓటమికి నారా లోకేషే కారణం.. జగన్, కేంద్రాన్ని కలుస్తా'
Send us your feedback to audioarticles@vaarta.com
అవును మీరు వింటున్నది నిజమే.. ఈ మాటలు అన్నది ఎవరో కాదు.. ఒకప్పుటి టీడీపీ కీలకనేత అన్నం సతీష్ ప్రభాకర్. కొన్ని రోజుల క్రితం టీడీపీకి రాజీనామా చేసిన అన్నం.. కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ సుజనా చౌదరి ద్వారా కాషాయ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. ఆయన రాజీనామా చేసిన తర్వాత.. బీజేపీ తీర్థం పుచ్చుకున్న తర్వాత లోకేష్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈయన వ్యాఖ్యలు అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. అయితే తాజాగా గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. మరింత డోస్ పెంచి మాట్లాడారు. లోకేష్ కారణంగానే ఎన్నికల్లో టీడీపీ పార్టీ ఓడిపోయిందన్నారు.
లోకేష్, బాబు తప్ప ఎవరూ మిగలరు!
"నారా లోకేష్ వల్ల వల్ల పార్టీలో చాలామంది నేతలు ఇబ్బందిపడ్డారు. అందుకే పార్టీలో ఉండలేక రాజీనామా చేశాను. లోకేష్లా తండ్రిని అడ్డుపెట్టుకొని మంత్రిని కాలేదు. టీడీపీ కోసం గతంలో నేను గోడపై పోస్టర్లు కూడా అంటించాను. బాపట్ల నియోజకవర్గం, పార్టీ కోసం తన సొంత నిధుల్ని ఖర్చు చేశాను. లోకేష్ తీరు వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని.. ఇదే పరిస్థితి కొనసాగితే.. టీడీపీలో చివరికి లోకేష్, చంద్రబాబు తప్ప ఎవరూ మిగలరు" అని అన్నం జోస్యం చెప్పుకొచ్చారు.
త్వరలో జగన్ను, కేంద్రాన్ని కలుస్తా!
"లోకేష్ కారణంగా త్వరలో టీడీపీ పూర్తిగా ఖాళీ కాబోతోంది. ఆయన తీరుతోనే టీడీపీ నేతలంతా బీజేపీలోకి వెళ్తున్నారు. నేనూ ఎమ్మెల్సీ పదవిని వదులుకొని మరీ బీజేపీలోకి వెళ్లాను. టీడీపీ ప్రభుత్వంలో ఐటీ శాఖలో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టాలి. త్వరలోనే ముఖ్యమంత్రి జగన్ను కలిసి విచారణ జరపాలని కోరతాను. ఇక కేంద్రంతో మాట్లాడి సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తాము" అని అన్నం తేల్చిచెప్పారు.
మొత్తానికి చూస్తే.. నారా లోకేష్కు త్వరలోనే గడ్డుకాలం రాబోతోందని ఈ వ్యాఖ్యలను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకూ వరుసగా హాట్ హాట్ వ్యాఖ్యలు చేసిన ఈయన మున్ముంథు ఇంకెన్ని విషయాలు బయటపెడతారో..? ఎవరి మీద పడతారో అని టీడీపీ నేతలు బెంబేలెత్తిపోతున్నారు. అయితే ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత, నారా లోకేష్ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.