లోకేశ్ ఘోర పరాజయం.. ఆర్కే ఘన విజయం
- IndiaGlitz, [Friday,May 24 2019]
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ ఘోర పరాజయం చవిచూశారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకర్గం నుంచి పోటీచేసిన నారా లోకేశ్, వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) తలపడి ఓడారు. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి నిరాశే మిగిలింది.
ఆర్కే చేతిలో లోకేశ్ ఘోరంగా ఓడిపోయారు. లోకేశ్పై 5,200 ఓట్ల తేడాతో ఆర్కే ఘన విజయం సాధించారు. కాగా.. ఈ మంగళగిరి నుంచి రెండోసారి వరుసగా ఆర్కే విజయం సాధించారు.
ఎమ్మెల్సీగా మంత్రి అయిన నారా లోకేశ్ తొలిసారి.. ఎమ్మెల్యేగా పోటీచేసి ఆర్కే చేతిలో ఓటమిపాలయ్యారు. కాగా.. మంగళగిరి నియోజకవర్గంలో సుమారు 200కోట్లకు పైగా ఖర్చుచేశారని.. పెద్ద ఎత్తున మీడియాలో కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే కోట్లు ఖర్చుపెట్టినప్పటికీ ఓట్లు మాత్రం రాలేదు.
అంతేకాదు ఇంటికి కూలర్, ఏసీ, టీవీ ఇలా అడిగిందల్లా ఇచ్చారని సమాచారం. అయినప్పటికీ లోకల్ లీడర్, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే.. ఆర్కేనే మంగళగిరి ప్రజలు గెలిపించారు. అయితే ఆర్కేకు వ్యవసాయ శాఖ మంత్రి ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలుస్తోంది.