Nara Lokesh: కేంద్ర మంత్రితో లోకేష్ భేటీ


Send us your feedback to audioarticles@vaarta.com


కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో మానవ వనరుల సామర్థ్యాన్ని పెంపొందించేందుకు, ఎన్సీసీ మౌలిక సదుపాయాల వృద్ధి ద్వారా ఏపీలోని క్యాడెట్లకు మెరుగైన సదుపాయాలు అందించేందుకు సహకారం అందించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్ లోని 5 ఎన్సీసీ గ్రూపులు, 43 యూనిట్ల పరిధిలో 75 వేలమందికి పైగా క్యాడెట్లు ఉన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఎన్సీసీ డైరక్టరేట్ తెలంగాణాలో ఉండిపోయింది. ఏపీలో కూడా ప్రత్యేకంగా ఓ ఎన్సీసీ డైరక్టరేట్ ను ఏర్పాటు చేయాల్సిందిగా మంత్రిని కోరారు లోకేష్. దీనికి మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ సానుకూలంగా స్పందించారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఇందుకు అవసరమైన స్థలాన్ని కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని లోకేష్ తెలిపారు. ఏపీలో ఎన్సీసీ డైరక్టరేట్ ఏర్పాటుకు రూ.25 కోట్ల నిధులు మంజూరు చేయాలని, దీంతోపాటు అడిషనల్ డిజి ర్యాంకు అధికారిని, ఇతర సిబ్బందిని నియమించాలని కోరారు. దీంతో పాటు.. ఏపీలోని 5 ఎన్సీసీ గ్రూప్ హెడ్ క్వార్టర్స్ లో ఎన్సీసీ ట్రైనింగ్ అకాడమీలను ఏర్పాటు చేయాలని కోరారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments