నారా రోహిత్ గెస్ట్ రోల్....

  • IndiaGlitz, [Monday,November 20 2017]

విభిన్న‌మైన క‌థ‌ల‌ను ఎంచుకుని సినిమాలు చేసే యువ హీరోల్లో నారా రోహిత్ ఒక‌రు. ప్రస్తుతం నారా రోహిత్ త‌న స్వీయ నిర్మాణం సంస్థ‌లో 'నీది నాది ఒకే క‌థ‌' అనే సినిమాను నిర్మిస్తున్నాడ‌ట‌. ఈ సినిమాలో నారా రోహిత్ స్నేహితుడు శ్రీవిష్ణు హీరోగా న‌ట‌స్తున్నాడ‌ట‌. ఈ సినిమాను రోహిత్ నిర్మించ‌డంతో పాటు సినిమాను మ‌లుపు తిప్పే ఓ పాత్ర‌లో న‌టించ‌బోతున్నాడ‌ట‌. ఈ విష‌యాన్ని నారా రోహిత్ తెలియ‌జేశాడు.

ఈ సినిమాను డిసెంబ‌ర్ లేదా జ‌న‌వ‌రిలో విడుద‌ల చేయ‌డానికి ప్లాన్స్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం నారా రోహిత్ హీరోగా..ప‌వ‌న్ మ‌ల్లెల ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన 'బాల‌కృష్ణుడు' చిత్రం న‌వంబ‌ర్ 24న విడుద‌ల‌వుతుంది. . రెజీనా హీరోయిన్‌గా న‌టించింది.

More News

'పద్మావతి'కి రెండు రాష్ట్రాల్లో చుక్కెదురు...

ఈ మధ్య కాలంలో ఎక్కువ వివాదాల్లో కూరుకున్న చిత్రం `పద్మావతి`. రాజస్థాన్ మహారాణి పద్మావతి జీవితగాథను సంజయల్ లీలా బన్సాలీ అదే పేరుతో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. టైటిల్ పాత్రలో దీపికా పదుకొనే నటిస్తుంటే..చిత్తోర్గఢ్ రాజు రతన్సింగ్పాత్రలో షాహిద్ కపూర్, అల్లా ఉద్దీన్ఖిల్జీ పాత్రలో రణ్ వీర్సింగ్ నటిస్తున్నారు.

నేను డబుల్ మెచ్యూరిటీతో చేస్తున్న సినిమా ఇది - నాగార్జున

"శివ, అంతం, గోవింద గోవింద" వంటి సెన్సేషనల్ హిట్స్ అనంతరం రాంగోపాల్ వర్మ-అక్కినేని నాగార్జునల క్రేజీ కాంబినేషన్ లో దాదాపు 28 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత రూపొందుతున్న చిత్ర ప్రారంభోత్సవం నేడు (నవంబర్ 20) అన్నపూర్ణ స్టూడియోస్ లో అత్యంత ఘనంగా రాంగోపాల్ వర్మ శిష్యగణం, నాగార్జున మిత్ర బృందం సమక్షంలో జరిగింది.

సీట్ ఎడ్జ్ థ్రిల్లర్గా ప్రశంసలందుకుంటున్న 'ఖాకి'

పోలీస్ చిత్రాలకు ప్రేక్షకుల్లో ఆదరణ ఎప్పటికీ ఉంటుంది. ముఖ్యంగా విభిన్నమైన పోలీస్ కథనాలకు ప్రజలు నీరాజనం పడుతూనే ఉంటారనడానికి రీసెంట్గా విడుదలైన 'ఖాకి' చిత్రం.

కొటీకి పైగా పలికిన సువర్ణసుందరి హిందీ శాటిలైట్ రైట్స్

ఒక వైపు విజువల్ షో  మరోపక్క థ్రిల్లింగ్ సబ్స్టెన్స్.. ఈ రెండు అంశాలను బ్యాలెన్స్ చెసుకుంటూ ఓ చారిత్రాత్మక సినిమాను ,ఫాంటసీని నిర్మించాలంటే ఆషామాషీ విషయం కాదు. హిస్టారికల్ చిత్రాల  సక్సెస్ విషయంలొ ఇవే కీలకంగా మారాయి. తాజాగా  "సువర్ణసుందరి" టీజర్ చూస్తుంటే విజువల్ గా, కంటెంట్ పరంగా క్వాలిటీ మూవీగా కన్పిస్తొంది.

స‌ల్మాన్ సినిమా కూడా వాయిదా ప‌డుతుందా?

దీపికా ప‌దుకొనే టైటిల్ పాత్ర‌లో న‌టించిన 'ప‌ద్మావ‌తి' సినిమా డిసెంబ‌ర్ 1న విడుద‌ల కావాల్సింది. అయితే సెన్సార్‌కు, చిత్ర యూనిట్ స‌రైన డాక్యుమెంట్స్ స‌మ‌ర్పించ‌క‌పోవ‌డంతో సెన్సార్ బోర్డు సినిమా సెన్సార్ ను ఆపేసింది. అంతే కాకుండా పాత రూల్‌ను తెర‌పైకి తెచ్చింది.