నారా రోహిత్-జగపతిబాబు టైటిల్ పాత్రల్లో 'ఆటగాళ్లు' ప్రారంభం

  • IndiaGlitz, [Wednesday,October 11 2017]

స్టైలిష్ అండ్ సెన్సిబుల్ ఫిలిమ్ మేకర్ పరుచూరి మురళి దర్శకత్వం వహిస్తున్న సరికొత్త చిత్రం 'ఆటగాళ్లు'. ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్స్ పతాకంపై వాసిరెడ్డి రవీంద్ర-వాసిరెడ్డి శివాజీ-మక్కెన రాము-వడ్లపూడి జితేంద్రలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో నారారోహిత్-జగపతిబాబులు టైటిల్ పాత్ర పోషిస్తున్నారు. ఈ ఇంటెలిజంట్ థ్రిల్లర్ కి "గేమ్ విత్ లైఫ్" అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్ర ప్రారంభోత్సవం నేడు (అక్టోబర్ 11) రామానాయుడు స్టూడియోలో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది.

నారా రోహిత్-జగపతిబాబులపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి శేఖ‌ర్‌క‌మ్ముల క్లాప్‌నివ్వగా, దిల్‌రాజు కెమెరా స్విచ్ఛాన్ చేశారు. వి.వి.వినాయ‌క్ గౌర‌వ ద‌ర్శక‌త్వం వ‌హించారు.

నారా రోహిత్ మాట్లాడుతూ.. "తొలిసారి జ‌గ‌ప‌తిబాబుగారితో క‌లిసి చేస్తున్నాను. మా ఇద్ద‌రి వాయిస్‌లు చాలా ప్ర‌త్యేకంగా ఉంటాయి. మా ఇద్ద‌రి గొంతుల‌ను వినాల‌ని ఉంది. విజ‌య్‌.సి.కుమార్‌గారితో నేను చేస్తున్న రెండో చిత్ర‌మిది. సాయికార్తిక్‌తో ఏడో సినిమాకు ప‌నిచేస్తున్నాను. ఇదొక డిఫ‌రెంట్‌, ఎక్స్ పెరిమెంట్‌, క‌మ‌ర్షియ‌ల్ సినిమా. షూటింగ్ ఎప్పుడెప్పుడు మొద‌ల‌వుతుందా అని వెయిట్ చేస్తున్నాను. ఇద్ద‌రు తెలివైన వాళ్ల మ‌ధ్య జ‌రిగే క‌థ ఇది" అన్నారు.

జ‌గ‌ప‌తిబాబు మాట్లాడుతూ.. "టైటిల్ చాలా బావుంది. గేమ్ విత్ లైఫ్ అని ఉప‌శీర్షిక పెట్టాం. పెద‌బాబు నుంచి నాకు ముర‌ళి అంటే ఇష్టం. ఆ సినిమాలో పాట‌లు, కామెడీ, సీరియ‌స్‌నెస్ ఉంటుంది. ఇంకా పెద్ద హిట్ కావాల్సింది. దాన్ని మించిన సినిమా తీయ‌మ‌ని ముర‌ళితో చెబుతుంటాను. ఇప్పుడు చేస్తున్న ఈ సినిమా దాన్ని మించిన సినిమా అవుతుంది. నేను, రోహిత్‌తో పాటు ఇంకో ఇద్దరు కూడా ఉంటారు. నేను, రోహిత్ డ‌బ్బింగ్‌లో ఆడుకుంటాం" అన్నారు.

ద‌ర్శ‌కుడు పరుచూరి మురళి మాట్లాడుతూ.. "క‌థ న‌చ్చి ఇద్ద‌రు హీరోలు న‌టించ‌డానికి అంగీక‌రించారు. వారిద్ద‌రి గొంతులు చాలా బావుంటాయి. నారా రోహిత్‌గారు ఇలాంటి క‌థ‌ను ఒప్పుకోవ‌డం వ‌ల్ల భ‌విష్య‌త్తులో మ‌రిన్ని కొత్త క‌థ‌లు వ‌స్తాయి. చాలా వైవిద్య‌మైన సినిమా ఇది. రెండు షెడ్యూళ్ల‌లో చేస్తాం. వ‌చ్చే నెల నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ఉంటుంది. మంచి కామెడీ కూడా ఉంటుంది. కెమెరామేన్ విజ‌య్ ద‌గ్గ‌ర నేను చాలా నేర్చుకున్నాను. ఇందులో కామెడీతో పాటు అన్ని అంశాలు పుష్క‌లంగా ఉంటాయి" అన్నారు.

ఈ చిత్రానికి మాటలు: గోపి, కెమెరా: విజయ్.సి.కుమార్, మ్యూజిక్: సాయికార్తీక్, ఎడిటర్: మార్తాండ్ కె.వెంకటేష్, ఆర్ట్: ఆర్.కె.రెడ్డి, పి.ఆర్.ఓ: వంశీ-శేఖర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎం.సీతారామరాజు, నిర్మాతలు: వాసిరెడ్డి రవీంద్ర-వాసిరెడ్డి శివాజీ-మక్కెన రాము-వడ్లపూడి జితేంద్ర, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: పరుచూరి మురళి.

More News

పూరి కోసం బాల‌య్య ముహుర్తం...

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న చిత్రం 'మెహ‌బూబా'.  ఈ సినిమాలో పూరి జ‌గ‌న్నాథ్ త‌నయుడు ఆకాష్ పూరి హీరోగా న‌టిస్తున్నారు. ఈరోజు ఉద‌యం 8.20 నిమిషాల‌కు సినిమాను హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో ప్రారంభించారు.

ప్ర‌కాష్ రాజ్ గురించి వ‌ర్మ క్లారిటీ

విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ ఆస‌క్తిక‌ర‌మైన పాత్ర‌లో క‌న‌ప‌డ‌బోతున్నారు. ఆ పాత్ర మ‌రెవ‌రిదో కాదు. ఆంధ్రుల ఆరాధ్య నాయ‌కుడు స్వ‌ర్గీయ ఎన్టీఆర్‌. ఇంత‌కు ఈ సినిమా డైరెక్ట‌ర్ ఎవ‌ర‌నే విష‌యాన్ని ప్రత్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు...వివాదాల ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ‌.

నయనతార పొలిటికల్ డ్రామా చిత్రం కర్తవ్యం

నయనతార ప్రధాన పాత్రలో గోపి నైనర్ దర్శకత్వం లో శివ లింగ, విక్రమ్ వేధా వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించి, 450 పైగా చిత్రాలను డిస్టిబ్యూట్ చేసిన ఆర్ రవీంద్రన్  నిర్మాతగా  ట్రైడెంట్ ఆర్ట్స్ (Trident Arts )  పతాకం పై తమిళం లో నిర్మించబడుతున్న ఆరమ్ (Araam)  చిత్రాన్ని తెలుగు లో కర్తవ్యం పేరుతో విడుదల చేస్తున్నారు.

సుశాంత్ - రాహుల్ మూవీ ప్రారంభం

తేజ్ వీర్ నాయుడు సమర్పించు, సిరుని సినీ కార్పొరేషన్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్ర పూజ కార్యక్రమాలు ఈ రోజు (బుధవారం)ప్రారంభం అయ్యింది. సుశాంత్ హీరోగా ప్రముఖ హీరో రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండడం విశేషం.

రవితేజ‌తో మ‌రోసారి...

వీర‌, సారొచ్చారు సినిమాలు తర్వాత మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, కాజ‌ల్ అగ‌ర్వాల్ కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా రానుంది. ఆ సినిమా మ‌రేదో కాదు భోగ‌న్ రీమేక్‌. త‌మిళ సినిమా భోగ‌న్‌లో జ‌యం ర‌వి హీరో కాగా అర‌వింద‌స్వామి విల‌న్‌, హ‌న్సిక హీరోయిన్‌గా న‌టించారు.