‘ఎవరూ చేయని పని వైఎస్ జగన్ చేస్తున్నారు’

  • IndiaGlitz, [Friday,November 08 2019]

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కనివినీ ఎరుగని విజయం సొంతం చేసుకున్న వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సీఎంగా ప్రమాణం చేసినప్పట్నుంచి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తీసుకున్న కీలక, సంచలన నిర్ణయాలు మనందరమూ చూసే ఉంటాం. అంతేకాదు.. ఇప్పటి వరకూ ఎక్కడా.. ఎవరూ చేయని విధంగా కేబినెట్‌ కూర్పు కూడా జగన్ చేశారు. మరోవైపు పాదయాత్రలో ఇచ్చిన హామీలు.. ప్రభుత్వం ఏర్పాటు చేశాక తూ.చా తప్పకుండా అమలు చేయడం చూసి ఇది వరకూ పాలించిన ముఖ్యమంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీలు కూడా ఆశ్చర్యపోతున్నారు. తాజాగా జగన్ పాలనపై టాలీవుడ్ సీనియర్ నటుడు నారాయణ మూర్తి స్పందించారు. ఈ సందర్భంగా సామాజిక న్యాయం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

స్వాతంత్ర్యం వచ్చాక ఎవరూ చేయని..!

‘స్వాతంత్ర్యం వచ్చాక ఎవరూ చేయని అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలు జగన్ చేపట్టి అమలు చేస్తున్నారు. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని జగన్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించాలని కోరుకుంటున్నారు. రిజర్వేషన్ల కోసం పార్లమెంట్‌లో బిల్లు పెట్టించినందుకు జగన్‌కు అభినందనలు. ప్రభుత్వ పాలన అద్భుతంగా ఉంది. సామాజిక న్యాయం కోసం జగన్ చేస్తున్న కృషి ప్రశంసనీయం. జనాభాలో 54శాతం ఉన్న బీసీలకు చట్టసభల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని జగన్ ప్రయత్నిస్తున్నారు.. అది అభినందనీయం’ అని జగన్‌పై నారాయణమూర్తి మెచ్చుకున్నారు. కాగా టాలీవుడ్ నుంచి పెద్దలు.. జగన్ పరిపాలనపై ఇంతవరకూ ఎవరూ స్పందించిన దాఖలాల్లేవ్. అయితే ఫస్ట్ టైమ్ మూర్తి ప్రశంసలు కురిపించడంపై టాలీవుడ్ యాక్టర్స్ కమ్ వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.

More News

కమ్మరాజ్యం నుంచి ‘పప్పులాంటి అబ్బాయ్..’ పాటొచ్చేసిందోచ్!

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ.. ఏం చేసినా సంచలనమే. సినిమా తీసినా.. ట్విట్టరెక్కి ట్వీట్ చేసినా అది సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతుంది.

పోలవరంపై ఉదయం షాకింగ్.. సాయంత్రం గుడ్ న్యూస్!

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రాజెక్ట్ పోలవరంపై గత కొన్ని రోజులుగా ఇటు కోర్టులు...

అనారోగ్యంపై స్పందించి.. క్లారిటీ ఇచ్చుకున్న యాంకర్ ప్రదీప్

టాలీవుడ్ టాప్ యాంకర్లలో ఒకరైన ప్రదీప్.. గత కొన్నిరోజులుగా స్క్రీన్‌పై కనపించకపోవడంతో అసలేం జరిగింది..?

మ‌రో హీరోయిన్‌తో క‌మ‌ల్ రిలేష‌న్‌లో ఉన్నాడా?

భార‌త‌దేశం గ‌ర్వించ‌ద‌గ్గ న‌టుల్లో లోక నాయ‌కుడు క‌మ‌ల్‌హాస‌న్ ఒక‌రు. ఈయ‌న సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఆరు ద‌శాబ్దాలు దాటింది.

రోహిత్ శెట్టి కారు ధ‌ర ఎంతో తెలుసా?

బాలీవుడ్‌లో క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌ను ప్రేక్ష‌కులు మెప్పించేలా సినిమాల‌ను తెర‌కెక్కిస్తూ క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్‌గా త‌నకంటూ ఓ ఇమేజ్‌ను సృష్టించుకున్నాడు డైరెక్ట‌ర్ రోహిత్ శెట్టి.