'మా' ప్రమాణోత్సవంలో హేమను అవమానించిన నరేశ్!

  • IndiaGlitz, [Friday,March 22 2019]

‘మా’  (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా గెలిచిన సీనియర్ నటి హేమ సత్తా ఏంటో చాటిన సంగతి తెలిసిందే. అయితే శుక్రవారం రోజున జరిగిన ప్రమాణ స్వీకారోత్సవంలో ఉపాధ్యక్షురాలు హేమకు తీవ్ర అవమానం జరిగింది. ప్రమాణం అనంతరం కార్యక్రమంలో నరేశ్, జీవిత, రాజశేఖర్ ప్రసంగించారు. అప్పటికే నరేశ్ వర్సెస్‌‌ రాజశేఖర్‌గా వాతావరణం నెలకొంది. అయితే ఈ కార్యక్రమంలో మాట్లాడేందుకు హేమ మైక్ తీసుకున్నారు.

ఆమె ‘మా’కు సంబంధించిన పలు విషయాలపై మాట్లాడుతుండగా మధ్యలో కలుగజేసుకున్న నరేశ్.. హేమ మైక్‌‌ లాగేశారు. దీంతో స్టేజ్‌పై ఉన్న పెద్దలు, సభికులుంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే హేమ మాట్లాడుతున్నప్పటికీ నరేశ్ మైక్ లాక్కుని వెళ్లిపోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. సాటి మహిళకు అన్యాయం జరుగుతోందని భావించారో ఏమోగానీ జీవిత రంగంలోకి దిగి.. జీవిత, మరోవైపు రాజశేఖర్‌ ఆమెకు మైక్ అందించారు. దీంతో ప్రమాణోత్సవంలో అసలేం జరుగుతోంది..? ప్రమాణం రోజే నరేశ్ ఏంటి  ఇలా ప్రవర్తిస్తున్నారు..? ఇప్పుడే ఇలా ఉంటే మున్ముంథు పరిస్థితులు ఎలా ఉంటాయో..? అంటూ ముక్కున వేలేసుకున్నారు.

హేమ ఏమన్నారంటే..

నరేశ్ ప్రకటించిన అంశలన్నీ ఆయన సొంతంగా తీసుకున్న నిర్ణయాలే. మమ్మల్ని ఇంతరవరకు సంప్రదించలేదు.. కనీసం మీటింగ్‌లో కూడా చెప్పలేదు. మమ్మల్ని కలుపుకోకుండా సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. చాలా మందిలో ఈ అసంతృప్తి ఉంది. వారందరి తరుపున నేను మాట్లాడుతున్నా. మా కార్యవర్గంలో 26మంది సభ్యులు ఒక్కటే. అంతా కలసి నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రకటన చేయండి. సారీ నరేశ్‌ మీరిలా చేయడం నాకు నచ్చలేదు అని హేమ తన ప్రసంగాన్ని తీవ్ర అసంతృప్తి, ఆవేదనతో ముగించారు.

More News

ప్రమాణ స్వీకారం రోజే కోటను అవమానించిన నరేశ్!

‘మా’ (మావీ ఆర్టిస్ట్ అసోసియేషన్) కొత్త కమిటీ శుక్రవారం రోజున ప్రమాణ స్వీకారోత్సవం అట్టర్ ప్లాప్ అయ్యింది.

ఏం విజయసాయి.. మీ అనుమతి తీసుకోవాలా..!?

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

జనసేన నుంచి మ‌రో జాబితా విడుదల

జనసేన పార్టీ నుంచి శాసనసభకు పోటీ చేసే అభ్యర్థులతో మ‌రో జాబితాను విడుదల చేశారు. జనసేన అధ్యక్షుడు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ 16 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు.

పవన్ కల్యాణ్‌పై రోజా సంచలన కామెంట్స్

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైసీపీ ఎమ్మెల్యే, నగరి ఎమ్మెల్యే అభ్యర్థి రోజా సంచలన కామెంట్స్ చేశారు. రోజా చేసిన ఈ హాట్ కామెంట్స్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌ అయ్యాయి.

అఫిడవిట్ ప్రకారం పవన్ ఆస్తులు ఇవీ...

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ జిల్లా గాజువాక, పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో రెండు చోట్ల పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.