Ramya Raghupathi:నరేష్ అఫైర్స్ అన్నీ విజయ నిర్మలకు తెలుసు.. పవిత్ర అలా దగ్గరైంది : రమ్య రఘుపతి సంచలనం

  • IndiaGlitz, [Tuesday,January 17 2023]

చిత్ర పరిశ్రమలో సీనియర్ హీరో నరేశ్, పవిత్రా లోకేష్‌ల వ్యవహారం ఎంతటి కలకలం రేపిందో తెలిసిందే. వీరు పెళ్లి చేసుకుంటారా, లేక సహజీనవంతోనే సరిపెడతారా అంటూ జరుగుతున్న ప్రచారానికి చెక్ పెడుతూ ఇద్దరూ కలిసి ఈ ఏడాది పెళ్లి చేసుకోబోతున్నట్లు ఓ వీడియో రిలీజ్ చేశారు. అంతేకాదు.. ఈ వీడియోలో పవిత్రకు లిప్ కిస్ పెట్టి లేటు వయసులోనూ తగ్గేది లేదని నిరూపించారు నరేష్. పెళ్లయితే చేసుకుంటామని చెప్పారు కానీ.. అది ఈ ఏడాదిలో ఎప్పుడనేది మాత్రం చెప్పలేదు.

నా పిల్లాడి జీవితమే ముఖ్యం:

ఇదిలావుండగా.. నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి గత కొన్ని రోజులుగా యూట్యూబ్ ఛానెల్స్‌తో ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే అసలు పవిత్రా లోకేష్‌కు నరేష్ ఎలా దగ్గరయ్యాడు.. ఇద్దరి బంధం ఇక్కడిదాకా ఎలా వచ్చిందో చెబుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నరేష్ విడాకులు కావాలని పిటిషన్ వేశారని, అదే తనకు పెద్ద ఆధారమన్నారు. ఆరు నెలలు కావొస్తున్నా తనపై చేసిన ఆరోపణలు మాత్రం ఆయన నిరూపించలేకపోయారని రమ్య దుయ్యబట్టారు. ఆస్తి కోసమే తాను ఇదంతా చేస్తున్నానని అంటున్నారని.. కానీ తనకు తన పిల్లాడి జీవితమే ముఖ్యమని, అందుకే పోరాటం చేస్తున్నానని ఆమె స్పష్టం చేశారు.

ఆర్ధిక కారణాలతోనే నరేష్‌కి పవిత్ర క్లోజైంది:

నరేష్‌‌కు పవిత్రా లోకేష్ క్లోజ్ అవ్వడానికి కారణం కేవలం ఆర్ధిక పరమైన అంశాలే కారణమని రమ్య రఘుపతి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భర్తకు ఎంతో మందితో ఎఫైర్స్ వుండేవని, ఇప్పుడు ఇంట్లో అడిగేవారు లేకపోవడంతో పవిత్ర బాగా దగ్గరైందని ఆమె అన్నారు. మా అత్తగారికి ఇవన్నీ తెలిసినా.. నరేష్ ఎప్పటికైనా మారుతారని చెప్పేవారని రమ్య ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదని ఏదైనా కోర్టులోనే తేల్చుకుంటానని రమ్య రఘుపతి స్పష్టం చేశారు.

More News

Pallavi Joshi: షూటింగ్‌లో ప్రమాదం, ది కాశ్మీర్ ఫైల్స్ నటి పల్లవి జోషికి గాయాలు .. రక్తం కారుతున్నా షాట్ పూర్తి చేసి

బాలీవుడ్ నటి, జాతీయ అవార్డ్ గ్రహీత పల్లవి జోషి షూటింగ్‌లో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు.

Jr NTR : టీమిండియా క్రికెటర్లతో జూనియర్ ఎన్టీఆర్.. ఫోటోలు వైరల్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఫుల్ జోష్‌లో వున్నారు. ఇప్పటికే గతేడాది ఆర్ఆర్ఆర్ భారీ బ్లాక్ బస్టర్ సాధించడంతో ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కు వెళ్లారు తారక్.

Ram Gopal Varma: ఆ పోస్టులు అభిమానిగా చేసినవే, పవన్ కల్యాణ్ గారు.. మీ భాయిజాన్ జాగ్రత్త : నాగబాబుకు ఆర్జీవీ కౌంటర్

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ కావడం కలకలం రేపిన సంగతి తెలిసిందే.

MLA Biyyapu Madhusudhan Reddy:చిరుపై అభిమానం.. థియేటర్ బుక్ , కార్యకర్తలతో కలిసి ‘వాల్తేర్ వీరయ్య’చూసిన వైసీపీ ఎమ్మెల్యే

బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, శృతీహాసన్ జంటగా నటించిన వాల్తేర్ వీరయ్య సంక్రాంతికి విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.

Balakrishna:నా వాళ్లను నేను బాధపెడతానా ..  మన్నిస్తారని ఆశిస్తున్నా : దేవ బ్రాహ్మణులకి బాలయ్య లేఖ

దేవ బ్రహ్మాణులపై సినీనటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇటీవల చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే.