close
Choose your channels

‘అమ్మరాజ్యం..’ రిలీజ్ అయితే ప్రతిపక్ష హోదా పోతుందా!?

Wednesday, December 11, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

‘అమ్మరాజ్యం..’ రిలీజ్ అయితే ప్రతిపక్ష హోదా పోతుందా!?

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘అమ్మరాజ్యంలో కడపబిడ్డలు’ చిత్రం రిలీజ్‌కు సెన్సార్ బోర్డు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు మొన్నటి వరకు వార్తలు వచ్చాయి. అంతేకాదు ఈ క్రమంలో చిత్రబృందం రిలీజ్ డేట్‌ను కూడా ఫిక్స్ చేసుకుంది. రేపు అనగా డిసెంబర్-12న సినిమా రిలీలజ్ కానుంది. అయితే ఉన్నట్టుండి సెన్సార్ బోర్డు, హైకోర్టు మంగళవారం నాడు ఊహించని షాకిచ్చింది. తాము సర్టిఫికెట్ ఇవ్వలేదని సెన్సార్ బోర్డు.. కట్స్ లేకుండా ఎలా రిలీజ్ చేస్తారని హైకోర్టు రెండు వైపుల నుంచి ఎదురుదెబ్బలు తగలడంతో చేసేదేమీ లేక కట్స్ చేసుకుని మళ్లీ బుధవారం నాడు సెన్సార్, హైకోర్టుకు చిత్రబృందం సమర్పించుకుంది.

కట్స్ అన్నీ ఇచ్చినప్పటికీ..!
అయినప్పటికీ సెన్సార్ నుంచి సర్టిఫికెట్ రాకపోవడంతో సినిమా యూనిట్ తీవ్ర ఆగ్రహానికి లోనైంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని సెన్సార్ బోర్డు ముందు దర్శకనిర్మాతలు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా నిర్మాత నట్టి కుమార్ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సెన్సార్ బోర్డు రాజశేఖర్ ఈ సినిమా చూసి ఆర్సీకి రెఫర్ చేశారని.. తాము కట్స్ అన్నీ ఇచ్చినప్పటికీ సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకుండా జాప్యం చేయడమేంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 12న రిలీజ్ చేస్తున్నామని ప్రకటించామని.. ఈ క్రమంలో ఇలా అడుగడుగునా అడ్డుపడటమేంటి..? అని ఆయన కన్నెర్రజేశారు.

ప్రతిపక్ష హోదా పోతుందా..!?
అయితే.. ఈ సినిమా సుజనా చౌదరి అడ్డుకుంటున్నారని నిర్మాత సంచలన ఆరోపణలు చేశారు. టీడీపీ నేతలు 50 లక్షల రూపాయలు ఇచ్చి సినిమాను అపుతున్నారని ఆయన ఆరోపించారు. సినిమా విడుదలైతే టీడీపీకి ప్రతిపక్ష హోదా పోతుందని నట్టికుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ సినిమా విషయంలో రాజశేఖర్ అనే సెన్సార్ సభ్యుడు రూ. 50 లక్షలు డిమాండ్ చేశాడని.. ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని నట్టికుమార్ స్పష్టం చేశారు. ఇవాళ మరోసారి ఈ వ్యవహారంపై కోర్టులో విచారణ జరగనుందని.. తమకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నామని ఆయన తెలిపారు. కోర్టు తీర్పు అనంతరం సినిమా యూనిట్ నిర్ణయాన్ని ప్రకటిస్తామని నట్టికుమార్ స్పష్టం చేశారు.

అయితే ప్రతిపక్ష హోదా పోతుందనే నట్టి వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. అసలు సినిమాలో అంతగా ఏం చూపించారు..? సినిమాలో ఉండే మతలబు ఏంటి..? అనేదానిపై ఇటు సినీ ఇండస్ట్రీలోనూ చర్చనీయాంశమైంది. మరి అసలు ఈ మాటల వెనుక అర్థమేంటో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేంత వరకూ వేచి చూడాల్సిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.