బెల్లంకొండ శ్రీ‌నివాస్ చిత్రంలో న‌వ‌దీప్‌?

  • IndiaGlitz, [Tuesday,March 27 2018]

బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్‌లుగా ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ద్వారా శ్రీనివాస్ రెడ్డి  టాలీవుడ్‌కు దర్శకుడిగా పరిచయం కానున్నారు. వంశధార క్రియేషన్స్ పతాకంపై నవీన్ శొంఠినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీత దర్శకుడు. థ్రిల్లర్ నేపథ్యంతో సాగే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లకు అవకాశముందని తెలుస్తోంది.

రెండో హీరోయిన్ పేరును త్వరలోనే ప్రకటించనున్నారు. ఇప్పటికే ఈ చిత్రంలో ‘ఒకరికి ఒకరు’ ఫేమ్ శ్రీరామ్ ముఖ్య పాత్రలో నటించనుండగా.. మరో నటుడు నవదీప్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నారని ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాలు ముచ్చ‌టించుకుంటున్నాయి. ఇటీవల కాలంలో.. నవదీప్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన‌ ‘ధృవ’, ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాలు విజయాలు సాధించాయి. మరి ఈ సినిమాతో హ్యాట్రిక్ విజయాన్ని అందిస్తారేమో చూడాలి. ఈ నెల 2 నుంచి చిత్రీకరణ జ‌రుపుకుంటున్న‌ ఈ చిత్రం ఇప్పటికే కొంత షూటింగ్ పార్టును పూర్తిచేసుకుంది. ఇదిలా ఉంటే.. శ్రీవాస్ దర్శకత్వంలో శ్రీనివాస్, పూజా హెగ్డే జంటగా నటించిన ‘సాక్ష్యం’ మే 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.
 

More News

 ‘ఎం.ఎల్.ఎ’ సక్సెస్‌తో గ‌ర్వంగా ఫీల‌వుతున్నాం -నిర్మాత‌లు

నందమూరి కల్యాణ్ రామ్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన చిత్రం ‘ఎం.ఎల్.ఎ` టి.జి.విశ్వప్రసాద్ సవుర్పణలో

'అభిమన్యుడు' లో 'యాంగ్రి బర్డ్‌లాంటి నన్నె తను లవ్‌ చేసెలేరా'.. పాట విడుదల

మాస్‌ హీరో విశాల్‌ కథానాయకుడిగా పి.ఎస్‌.మిత్రన్‌ దర్శకత్వంలో

అఖిల్‌-వెంకీ అట్లూరి చిత్రం ప్రారంభం

యూత్‌కింగ్‌ అఖిల్‌ హీరోగా శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకం పై తొలి సినిమా 'తొలిప్రేమ'తో సూపర్‌ హిట్‌ సాధించిన వెంకీ అట్లూరి దర్శకత్వంలో ప్రొడక్షన్‌ నెం.25

'కృష్ణార్జున యుద్ధం' ఏప్రిల్ 12న గ్రాండ్ రిలీజ్

వ‌రుస విజ‌యాల హీరో నేచుర‌ల్ స్టార్ నాని న‌టిస్తున్న చిత్రం `కృష్ణార్జున యుద్ధం` ఈ ఏప్రిల్ 12న విడుద‌ల కానుంది.

సెన్సార్ కార్య‌క్ర‌మాల్లో 'నా క‌థ‌లో నేను'

జియ‌స్‌కే ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై  శివ‌ప్ర‌సాద్ గ్రంథే స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో నిర్మిస్తోన్న చిత్రం 'నా క‌థ‌లో నేను'. సాంబశివ , సంతోషి శ‌ర్మ హీరో హీరోయిన్లుగా న‌టించారు.