చ‌ర‌ణ్ ధృవ లో యువ హీరో..

  • IndiaGlitz, [Tuesday,June 07 2016]

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్న తాజా చిత్రం ధృవ‌. ఈ చిత్రాన్ని సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కిస్తున్నారు. త‌ని ఓరువ‌న్ రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఈ చిత్రంలో చ‌ర‌ణ్ స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తుంది. తాజాగా ఈ చిత్రంలో యువ హీరో న‌వ‌దీప్ ఎంట్రీ ఇచ్చాడు. రామ్ చ‌ర‌ణ్ ఈ చిత్రంలో పోలీస్ గా న‌టిస్తున్నారు.

ఈ పోలీస్ పాత్ర‌కు క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్ద‌రు ఉంటారు. త‌ని ఓరువ‌న్ లో హీరో ఫ్రెండ్స్ క్యారెక్ట‌ర్స్ ను గ‌ణేష్ వెంక‌ట్రామ‌న్, హ‌రీష్ ఉత్త‌మ‌న్ లు పోషించారు. ఈ ఇద్ద‌రిలో ఎవ‌రి పాత్ర కోసం న‌వ‌దీప్ ని తీసుకున్నారో తెలియ‌దు కానీ...న‌వ‌దీప్ పాత్ర‌కి మాత్రం ఇంపార్టెన్స్ ఉంటుంద‌ని స‌మాచారం. ఇక ఈ చిత్రంలో విల‌న్ గా త‌ని ఓరువ‌న్ లో న‌టించిన అర‌వింద్ స్వామి ఈ చిత్రంలో కూడా విల‌న్ గా న‌టిస్తుండ‌డం విశేషం. ఈ చిత్రాన్ని ముందుగా ఆగ‌ష్టులో రిలీజ్ చేయాల‌నుకున్నా...కానీ తాజా స‌మాచారం ప్ర‌కారం ద‌స‌రాకి రిలీజ్ చేయ‌నున్నారని తెలుస్తోంది.

More News

అది ఓ అద్భుత‌మైన ఫీలింగ్ అంటున్న శృతి

క‌మ‌ల్ హాస‌న్ న‌టిస్తున్న త్రిభాషా చిత్రం శ‌భాష్ నాయుడు. ఈ చిత్రంలో క‌మ‌ల్ హాస‌న్ బ‌ల‌రామ్ నాయుడు గా న‌టిస్తున్నారు. ఈ చిత్రంలో క‌మ‌ల్ హాస‌న్ భార్య‌గా ర‌మ్య‌కృష్ణ న‌టిస్తుండ‌గా... క‌మ‌ల్ కుమార్తెగా రియ‌ల్ డాట‌ర్ శృతిహాస‌న్ న‌టిస్తుండ‌డం విశేషం.

దిల్ రాజు కాస్టింగ్ కాల్ ఫ‌ర్ వ‌రుణ్ తేజ్ మూవీ..

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు త‌న‌యుడు వ‌రుణ్ తేజ్ హీరోగా దిల్ రాజు ఓ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. ఈ చిత్రానికి శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు.

రజనీకాంత్ తో రమ్యకృష్ణ...?

17 ఏళ్ల తర్వాత రజనీకాంత్, రమ్యకృష్ణలు కలిసి నటించబోతున్నారనే వార్తలు వినపడుతున్నాయి. 1999లో విడుదలైన నరసింహ(తమిళంలో పడయప్పా) చిత్రంలో నరసింహగా రజనీకాంత్, నీలాంబరిగా రమ్యకృష్ణ చేసిన సందడి అందరికీ గుర్తుండే ఉంటుంది

త్రివిక్రమ్ చెబితే మహేష్ వద్దన్నాడు

రీసెంట్ గా విడుదలైన అఆ చిత్రంతో త్రివిక్రమ్, నితిన్, సమంత కాంబినేషన్ బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. ముఖ్యంగా ఓవర్ సీస్ లో సినిమా కలెక్షన్స్ రెండు మిలియన్ డాలర్స్ కు దగ్గరపడుతున్నాయి. అయితే ఈ అఆ కథను త్రివిక్రమ్ ముందుగా సూపర్ స్టార్ మహేష్ కే చెప్పాడట.

సందీప్ నీ ప్ర‌మోష‌న్ స్టైల్ సూప‌ర్..

సందీప్ కిష‌న్ తన మూవీ ప్రమోషన్ కోసం ఒక కొత్త విధానం ఎంచుకున్నారు. తన ఫాన్స్ తో కలిసి ఒక అనాధ పిల్లల‌ శరణాలయానికి వెళ్లి ప్రేమ‌ని పంచి డబ్బులు డొనేట్ చేయ‌నున్నారు.