close
Choose your channels

త‌మిళంలోకి న‌వీన్ పొలిశెట్టి చిత్రం

Tuesday, November 12, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

త‌మిళంలోకి న‌వీన్ పొలిశెట్టి చిత్రం

న‌టుడిగా కెరీర్‌ను ప్రారంభించిన న‌వీన్ పొలిశెట్టి బాలీవుడ్‌లోనూ స్క్రిప్ట్ రైట‌ర్‌గా ప‌లు చిత్రాల‌కు ప‌నిచేశారు. ఈ ఏడాది ఈయ‌న `ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ‌`తో స‌క్సెస్‌ను సొంతం చేసుకున్నారు. రెండో చిత్రంగా బాలీవుడ్‌లో `చిచోరే`లో న‌టించారు. ఈ చిత్రం కూడా మంచి విజ‌యాన్ని దక్కించుకుంది. చిన్న సినిమాగా విడుద‌లైన `ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ‌` ఈ ఏడాది భారీ విజ‌యాన్ని ద‌క్కించుకుంది. స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రానికి స్వ‌రూప్ డైరెక్ట‌ర్‌. రాహుల్ యాద‌వ్ న‌క్కా నిర్మాత‌. ఈ సినిమాలో న‌వీన్ పొలిశెట్టి హీరోగా న‌టిస్తూనే స్క్రీన్‌ప్లేలోకూడా భాగ‌మ‌య్యాడు. బేసిక్‌గా న‌వీన్ స్క్రీన్ ప్లే రైట‌ర్ కావ‌డంతో ఏజెంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయ‌ను ఆస‌క్తిక‌రంగా మ‌లుచుకున్నాడు. ఇప్పుడు ఈ సినిమాను త‌మిళంలో రీమేక్ చేస్తున్నార‌ని స‌మాచారం. త‌మిళంలో స్టార్ క‌మెడియ‌న్‌గా పేరున్న సంతానం ఈ సినిమాలో టైటిల్ పాత్ర‌ను పోషిస్తాడ‌ని స‌మాచారం.

కాగా న‌వ‌న్ పొలిశెట్టి ప్ర‌స్తుతం పిట్ట‌గోడ ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌బోతున్నాడు. ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడు నాగాశ్విన్ నిర్మాత‌గా మారుతున్నాడు. స్వ‌ప్న ద‌త్‌, ప్రియాంక ద‌త్‌లు కూడా ఇందులో నిర్మాత‌లే. ఈ చిత్రానికి జాతిర‌త్నాలు అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. ఈ సినిమాకు సంబంధించిన లుక్ కూడా విడుద‌లైంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.