ప్రతినాయకిగా

  • IndiaGlitz, [Thursday,April 18 2019]

అందాల తార నయనతార ఇప్పుడు మరో వైవిధ్యమైన పాత్రలో మెప్పించనున్నారు. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, ఎ.ఆర్‌.మురుగదాస్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం 'దర్బార్‌'. ఈ సినిమా ముంబైలో షూటింగ్‌ జరుపుకుంటోంది. అయితే ఈ సినిమాలో నయనతార నటించనుందనే సంగతి తెలిసిందే.

అయితే ఆసక్తికరమైన విషయమేమంటే.. ఈ సినిమాలో రజనీకాంత్‌, నయనతార జంటగా నటించడం లేదట. నయనతార ప్రతి నాయకి పాత్రలో నటించనుందని వార్తలు వినపడుతున్నాయి. ఇదే కనుక నిజమైతే సినిమా ఆసక్తికరంగా ఉంటుందనడంలో సందేహం లేదు.

అలాగే బాలీవుడ్‌ నటుడు ప్రతీక్‌ బబ్బర్‌ కూడా ఇందులో విలన్‌గా నటిస్తున్నాడట. ఈ చిత్రాన్ని మురుగదాస్‌.. తండ్రి, కూతురు మధ్య అనుబంధాల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాడట. రజనీకాంత్‌ కుమార్తెగా నివేదా థామస్‌ నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

More News

కొడుక్కి సారీ చెప్పిన నాని

నేచురల్‌ స్టార్‌ నాని తన కొడుకు అర్జున్‌కి సారీ చెప్పాడు. ఇంతకు కొడుక్కి నాని ఎందుకు సారీ చెప్పాల్సి వచ్చిందో తెలుసా! వివరాల్లోకెళ్తే..

నేను గెలిచాను.. థ్యాంక్యూ కేసీఆర్ గారు..: శ్రీరెడ్డి

టాలీవుడ్‌లో ‘కాస్టింగ్ కౌచ్’పై నటి శ్రీరెడ్డి చేసిన పోరాటానికి ఫలితం దక్కింది.

‘డేటాచోరీ’ కేసులో యూఐడీఏఐ కీలక ప్రకటన.. వాట్ నెక్స్ట్

తెలుగు రాష్ట్రాల్లోనే దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'డేటాచోరీ' కేసులో భారత విశిష్ఠ గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) కీలక ప్రకటన జారీ చేసింది.

'ఆకాశ‌వాణి విశాఖ‌ప‌ట్ట‌ణ కేంద్రం' టీజ‌ర్‌కు ట్రెమెండ‌స్ రెస్పాన్స్‌

అంద‌రికీ స‌ముద్రం దాటి సీత‌ను క‌లిసిన రాముడు క‌థ తెలుసు.. కానీ ఇంటి ముందే ఉండి క‌న్న తండ్రిని క‌ల‌వ‌లేని ఈ కార్తీక్ క‌థ తెలుసా! అని అంటున్నారు.

మే 10న 'నాగకన్య'

వరలక్ష్మి, కేథరీన్, లక్ష్మిరాయ్ నటిస్తున్న తాజా చిత్రం నాగకన్య. జర్నీ, రాజా రాణి చిత్రాల ఫేమ్ జై హీరోగా నటిస్తున్నారు. జంబో సినిమాస్ బ్యానర్ పై ఏ. శ్రీధర్ నిర్మాతగా ఎల్. సురేష్