మ‌ణిర‌త్నం 'పొన్నియిన్ సెల్వ‌న్‌' లో న‌య‌న‌తార‌!

  • IndiaGlitz, [Tuesday,July 16 2019]

మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న పీరియాడిక్ చిత్రం 'పొన్నియిన్ సెల్వ‌న్‌'. ఈ చిత్రం కోసం ఇప్ప‌టికే విక్ర‌మ్‌, ఐశ్వ‌ర్య‌రాయ్‌తో పాటు ప‌లువురు ఆర్టిస్టుల‌ను మ‌ణిర‌త్నం ఎంపిక చేశారు. తాజాగా ఈ స్టార్ లిస్టులో న‌య‌న‌తార పేరు వినిపిస్తోంది. మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో న‌య‌న‌తార ఇప్ప‌టిదాకా సినిమాలేవీ చేయ‌లేదు. పొన్నియిన్ సెల్వ‌న్ న‌వ‌ల‌లో కుంద‌వై అనే పాత్ర కోసం ఆమెను సంప్ర‌దించిన‌ట్టు స‌మాచారం. క‌ల్కి కృష్ణ‌మూర్తి రాసిన న‌వ‌ల పొన్నియిన్ సెల్వ‌న్‌. దీన్ని స్క్రీన్ కు మ‌ణిర‌త్నం, 'కాట్రిన్ మొళి', 'కురంగు బొమ్మై' కుమార‌వేలు క‌లిసి అడాప్ట్ చేస్తున్నారు.

మ‌ణిర‌త్నం అనారోగ్యం వ‌ల్ల ఈ స్క్రిప్ట్ కు బ్రేక్ ప‌డుతుంద‌ని ఆ మ ధ్య అంద‌రూ అనుకున్నారు. అయితే ఆయ‌న జ‌న‌ర‌ల్ చెక‌ప్‌కు వెళ్లొ వ‌చ్చి స్క్రిప్ట్ రైటింగ్‌లో పాల్గొన్నారు. న‌య‌న‌తార ప్ర‌స్తుతం తెలుగులో సైరా న‌ర‌సింహారెడ్డి, త‌మిళ్‌లో విజ‌య్ స‌ర‌స‌న బిగిన్‌, మ‌ల‌యాళంలో నివిన్ పాల్‌తో ల‌వ్ యాక్ష‌న్ డ్రామాలో న‌టిస్తున్నారు. అల్లు అర‌వింద్ తెర‌కెక్కించే రామాయ‌ణంలో సీత‌గా ఆమె పేరు వినిపిస్తోంది. అలాగే కొర‌టా శివ ద‌ర్శ‌క‌త్వంలో చిరంజీవి న‌టించే త‌దుప‌రి సినిమా కోసం ఆమెను సంప్ర‌తించిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. సో ఇప్పుడు ఈ లేడీ సూప‌ర్‌స్టార్ హైలో ఉంద‌న్న‌మాట‌.

More News

కొడుకును ఇబ్బంది పెట్టిన విక్ర‌మ్‌

చియాన్ విక్ర‌మ్ సినిమాల్లో బిజీ బిజీగా న‌టిస్తున్న త‌రుణంలోనే ఆయ‌న త‌న‌యుడు ధ్రువ్ హీరోగా ఎంట్రీ ఇచ్చేశాడు.

'సాహో' షూటింగ్ పూర్తి..

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో యు.వి.క్రియేష‌న్స్ నిర్మాణంలో వంశీ, ప్ర‌మోద్ నిర్మాత‌లుగా రూపొందిన భారీ బ‌డ్జెట్ చిత్రం `సాహో`.

వైఎస్ జగన్‌కు ఝలక్.. బీజేపీలోకి జంపింగ్‌లు!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ‘ఆపరేషన్ ఆకర్ష్’‌కు తెరలేపిన సంగతి తెలిసిందే.

ఓ ఆట ఆడుకుంటున్న అంజ‌లి!

తెలుగు ప‌డుచు అంజ‌లి ఓ ఆట ఆడుకోవ‌డానికి సిద్ధ‌మ‌వుతోంది. ఎవ‌రితో... ఎవ‌రిని...? ఎందుకు? అని ఊపిరాగేట‌న్ని ప్ర‌శ్న‌లు వేసేయ‌వ‌ద్దు.

త‌మిళ నిర్మాత‌గా మారుతున్న రానా

రానా ఇప్పుడు త‌మిళంలో నిర్మాత‌గా మారుతున్నారు.