నానితో సినిమా స్టార్ట్.. వెల్లడించిన హీరోయిన్ నజ్రీయా

  • IndiaGlitz, [Monday,April 19 2021]

ఇండస్ట్రీలో ఎవరైనా గ్యాప్ తీసుకోకుండా సినిమాలు చేస్తారంటే.. పక్కాగా వారిలో ముందు వరసలో నేచురల్‌ స్టార్‌ నాని పేరుంటుంది. అంతేకాదు.. పక్కా ప్లానింగ్‌తో వెళుతూ.. సినిమాలను పూర్తి చేసే రేసులోనూ నాని ఇతర హీరోల కంటే చాలా ముందున్నాడు. ఇప్పటికే 'టక్‌ జగదీష్‌' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. నిజానికి ఈ సినిమా ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు రావల్సి ఉంది. అయితే కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ కారణంగా సినిమా విడుదల చేసే నిర్ణయాన్ని చిత్ర యూనిట్ వెనక్కి తీసుకుంది. మరొక డేట్ చూసుకుని ఈ సినిమాను మేకర్స్ విడుదల చేయనున్నారు.

మరో వైపు 'శ్యామ్‌ సింగరాయ్‌' సెట్స్‌పై ఉంది. ఈ సినిమా షూటింగ్‌ పూర్తి కాక ముందే తన నెక్ట్స్‌ మూవీ షూటింగ్‌ను సైతం నాని స్టార్ట్ చేసేశాడు. నాని, వివేక్‌ ఆత్రేయ కాంబినేషన్‌లో 'అంటే సుందరానికీ!' సినిమా చేయబోతున్నట్లు అనౌన్స్‌ చేసిన సంగతి తెలిసిందే. సమ్మర్‌లో షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తామని అనౌన్స్‌మెంట్‌ రోజునే నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ తెలియజేసింది. చెప్పినట్లుగానే సమ్మర్‌లో షూటింగ్‌ను స్టార్ట్‌ చేశారు. సినిమా షూటింగ్‌ స్టార్ట్‌ అయిన విషయాన్ని సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోన్న నజ్రియా నజీమ్‌ తెలియజేసింది.

ఈ ముద్దుగుమ్మ నేరుగా తెలుగులో చేస్తున్న తొలి సినిమా ఇదే కావడం గమనార్హం. నజ్రియా తన ఇన్‌స్టాగ్రామ్‌లో అందరికీ నమస్కారం..ఈ రోజు నా తొలి తెలుగు సినిమా షూటింగ్‌ను మొదలు పెట్టాను. తొలిసారిగా చేసేది ఏదైనా స్పెషల్‌గా ఉంటుంది. కాబట్టి 'అంటే సుందరానికీ' చాలా స్పెషల్‌ అంటూ మెసేజ్‌ను పోస్ట్‌ చేసింది. లవ్‌ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా 'అంటే సుందరానికీ!' సినిమా రూపొందుతుంది.

More News

పూజ చేసి ఆపేసిన రవితేజ..

కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని కుదిపేస్తోంది. ఏప్రిల్ రెండవ వారం నుంచి కరోనా కేసులు దారుణంగా పెరిగిపోయాయి.

తల్లి పాత్రకు నో చెప్పిన రష్మిక..

దక్షిణాది చిత్రసీమలో అగ్రస్థానంలో కొనసాగుతున్న హీరోయిన్లలో రష్మిక మందన్నా ఒకరు.

అప్పుడు శభాష్ అనిపించుకున్న జగన్.. ఇప్పుడు పట్టించుకోవట్లేదేంటి..!?

ఏపీ సీఎం జగన్.. కరోనా ఫస్ట్ వేవ్‌ సమయంలో తీసుకున్న నిర్ణయాలు.. కరోనా కట్టడికి కృషి చేసిన తీరు ప్రశంసనీయం.

కరోనా తగ్గుముఖం పట్టేది అప్పుడేనట..

ఒక్కసారిగా ఊపందుకున్న కరోనా సెకండ్ వేవ్.. ప్రజానీకాన్ని భయాందోళనకు గురి చేస్తోంది. దేశ వ్యాప్తంగా 2.5 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవుతుండగా..

నా ఆరోగ్యం కుదుటపడుతోంది : పవన్

కరోనా నుంచి తన ఆరోగ్యం కుదుటపడుతోందని వైద్యుల సలహాలు పాటిస్తున్నానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెల్లడించారు.