ఎన్డీ తివారీ కుమారుడు రోహిత్ అనుమానాస్పద మృతి

  • IndiaGlitz, [Tuesday,April 16 2019]

ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ ఎన్డీ తివారీ కుమారుడు రోహిత్ శేఖర్ తివారీ దేశ రాజధాని ఢిల్లీలో అనుమానాస్పద స్థితిలో కన్నుమూశాడు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రోహిత్ ఢిల్లీలోని మాక్స్ సాకేత్‌లో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచాడు. ఇదిలా ఉంటే అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను ఆస్పత్రికి తీసుకొచ్చే లోపే మరణించారని మరోవైపు వార్తలు వినవస్తున్నాయి.

అయితే రోహిత్ మృతి చెందినట్లు వైద్యులు కొద్దిసేపటి క్రితమే నిర్ధారించారు. కాగా.. 39 ఏళ్ల రోహిత్ ఎలా చనిపోయారనే విషయం మాత్రం తెలియరాలేదు. రోహిత్ మృతిని దక్షిణ ఢిల్లీ డీఎస్పీ విజయ్‌కుమార్ ధ్రువీకరించారు. రోహిత్ శేఖర్ ఢిల్లీలోని ఢిఫెన్స్ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఘటన జరిగే సమయానికి రోహిత్ తల్లి అతని నివాసంలో లేరని తేలింది.

కాగా.. 2014లో కోర్టులో వ్యాజ్యం పడటం, డీఎన్‌ఏ టెస్ట్ తర్వాత తివారీ దిగొచ్చి రోహిత్ తన కొడుకేనంటూ తివారీ ఒప్పుకున్న విషయం తెలిసిందే. తివారీ తనను కొడుకుగా స్వీకరించాలని రోహిత్ న్యాయం కోసం కోర్టుకు ఎక్కడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. పలు పర్యాయాలు నిరాకరించినప్పటికీ తివారీ డీఎన్ఏ పరీక్ష అనగానే దిగివచ్చిన విషయం అందరికీ తెలిసిందే.

More News

మెట్రోలో ప్రయాణిస్తున్న మహిళలూ తస్మాత్ జాగ్రత్త...

మెట్రోలో ప్రయాణించాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. రైలు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఏమాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా అంతే సంగతులు.

నిహారిక కోసం సుకుమార్‌

మెగా ఫ్యామిలీ నుండి చాలా మంది హీరోలు తెలుగు సినిమాకు ప‌రిచ‌య‌మ‌య్యారు. అయితే ఈ ఫ్యామిలీ నుండి ప‌రిచ‌య‌మైన హీరోయిన్ నిహారిక కొణిదెల మాత్ర‌మే.

చిన్మ‌యి కెరీర్‌ను నాశనం చేస్తా - నిర్మాత రాజ‌న్‌

ద‌క్షిణాది మీ టూ ఉద్యమాన్ని సింగ‌ర్, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మ‌యి లీడ్ చేసిన సంగ‌తి తెలిసిందే.

టిక్‌టాక్ అభిమానులకు షాకింగ్ న్యూస్...!

అవును మీరు వింటున్నది నిజమే.. ఇకపై టిక్‌టాక్ కనిపించదు.! టిక్‌టాక్‌ను వెంటనే తమ ప్లేస్టోర్ల నుంచి తొలగించాలంటూ గూగుల్, యాపిల్ సంస్థలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

ఒక‌టి కాదు... రెండు దెయ్యాలు! మే 1న 'అభినేత్రి 2' విడుద‌ల‌

ప్ర‌భుదేవా, త‌మ‌న్నా జంట‌గా న‌టించిన `అభినేత్రి` తెలుగులో ఎంత పెద్ద విజ‌యం సాధించిందో తెలిసిందే.