నవ్యాంధ్ర తొలి మహిళా సీఎస్‌గా నీలం సాహ్ని

  • IndiaGlitz, [Thursday,November 14 2019]

నవ్యాంధ్ర తొలి మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సాహ్ని బాధ్యతలు స్వీకరించారు. కాగా ఏపీలో రెండోసారి ప్రభుత్వం ఏర్పాటయ్యాక సీఎస్‌గా ఎల్వీ సుబ్రమణ్యం వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన్ను బదిలీ చేసిన ప్రభుత్వం.. సాహ్నికి బాధ్యతలు కట్టబెట్టింది. ఇదిలా ఉంటే.. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సతీనాయర్‌, మిన్నీ మాథ్యూ ప్రభుత్వ మహిళా ప్రధాన కార్యదర్శులుగా బాధ్యతలు నిర్వర్తించారు. కాగా, ఇన్‌చార్జి సీఎస్‌ నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ నుంచి సాహ్ని ఈ రోజు పదవీ బాధ్యతలు స్వీకరించారు.

సాహ్నీ ట్రాక్ రికార్డ్ ఇదీ...

1984వ ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన సాహ్ని ఉమ్మడి ఏపీలో.. మచిలీపట్నం అసిస్టెంట్ కలెక్టర్‌గా పని చేశారు. టెక్కలి సబ్ కలెక్టర్‌గా, నల్గొండ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పని చేశారు. మున్సిపల్ పరిపాలన విభాగం డిప్యూటీ సెక్రటరీగా, స్త్రీ శిశు సంక్షేమశాఖ పీడీగా విధులు నిర్వహించారు. నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లోనూ పని చేసిన సాహ్ని.. నల్గొండ జిల్లా కలెక్టర్‌గా, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌గా విధులు నిర్వర్తించారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శిగా పని చేశాక.. ఎపీఐడీసీ కార్పొరేషన్ వీసీ అండ్ ఎండీగా ఉమ్మడి రాష్ట్రంలో పని చేశారు. అనంతరం స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. కాగా సాహ్ని 2020 జూన్ నెలాఖరు వరకు సర్వీస్‌లో ఉండనున్నారు. నవ్యాంధ్ర తొలి మహిళా సీఎస్ నీలం సాహ్ని కావడం విశేషం.

More News

రాహుల్.. జాగ్రత్త అంటూ సుప్రీం హెచ్చరిక

కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీకి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాదు ఒకింత సూచనలు, సలహాలు కూడా చేసింది. ‘మాట్లాడేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి..

'అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి' ఫస్ట్‌ లుక్‌ విడుదల

బ్లాక్‌ అండ్‌ వైట్‌ పిక్చర్స్‌, పూర్వీ పిక్చర్స్‌ పతాకంపై బాలు అడుసుమిల్లి దర్శకత్వంలో ప్రొడక్షన్‌ నెంబర్‌ 1గా హిమబిందు వెలగపూడి, వేగి శ్రీనివాస్‌ నిర్మిస్తున్న సినిమా

'అల వైకుంఠపురంలో..' నుంచి రేపు మరో స్పెషల్ సర్‌ప్రైజ్!

టాలీవుడ్ యంగ్ హీరో, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హేగ్దే నటీనటులుగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘అల వైకుంఠపురంలో..’.

కొత్త షెడ్యూల్‌లో శ‌ర్వానంద్ 'శ్రీకారం'

శ‌ర్వానంద్ హీరోగా రూపొందనున్న చిత్రం `శ్రీకారం`. 14రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్‌పై కిషోర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా రూపొందుతుంది. ఈ ఏడాది ఆగ‌స్ట్ నుండి సినిమా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది.

రానా సినిమా డైరెక్ట‌ర్‌, కెమెరామెన్ మ‌ధ్య గొడ‌వ‌ ?

సాధార‌ణంగా సినిమా మేకింగ్‌లో స్టార్స్‌, టెక్నీషియ‌న్స్ మ‌ధ్య మ‌న‌స్ప‌ర్ధ‌లు రావ‌డ‌మ‌నేది కామ‌న్‌గానే జ‌రుగుతుంటాయి. అయితే అవి అప్ప‌టి వ‌ర‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మ‌వుతూ ఉంటాయి.