ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకొస్తున్న నెల్లూరి పెద్దారెడ్డి...

  • IndiaGlitz, [Friday,March 09 2018]

సతీష్ రెడ్డి, మౌర్యానీ, ముంతాజ్ హీరో హీరోయిన్లుగా దర్శకుడు వీజే రెడ్డి రూపొందించిన చిత్రం నెల్లూరి పెద్దారెడ్డి. సిద్ధి విఘ్నేశ్వరా క్రియేషన్స్ పతాకంపై సీహెచ్ రఘునాథ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రభాస్ శీను, అంబటి శీను, సమ్మెట గాంధీ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

గ్రామీణ నేపథ్యంలో సాగే ఆహ్లాదకరమైన ప్రేమ కథగా ఈ సినిమా తెరకెక్కింది. చిత్ర నేపథ్యం భావోద్వేగాలతో ఉన్నా...కథనం ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది. నెల్లూరి పెద్దారెడ్డి చిత్రానికి సెన్సార్ యూఏ సర్టిఫికెట్ ఇచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న నెల్లూరి పెద్దారెడ్డి గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఈ నెల 16న నెల్లూరి పెద్దారెడ్డి సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ సందర్భంగా దర్శకుడు వీజే రెడ్డి మాట్లాడుతూ....నెల్లూరి పెద్దారెడ్డి చిత్రానికి సెన్సార్ అభినందనలు దక్కాయి. సెన్సార్ వాళ్లు యూఏ సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ నెల 16న దాదాపు వంద థియేటర్ లలో భారీగా మా చిత్రాన్ని విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నాం. పల్లె వాతావరణంలో కథంతా సాగుతుంది. పచ్చటి పైరుల అందాలు ప్రేక్షకులకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.

ఎక్కడా విసుగు అనిపించకుండా కథనం సాగుతుంది. కథ రీత్యా సెంటిమెంట్ చిత్రమైనా దాన్ని బ్యాలెన్స్ చేసేందుకు కావాల్సినంత వినోదం ఉంటుంది. పాటలు ఇప్పటికే శ్రోతల ఆదరణ పొందుతున్నాయి. నలుగురికి మంచి చేసే పెద్దారెడ్డి ఓ యువతి కుటుంబానికి ఆశ్రయమిస్తాడు. ఈ క్రమంలో అతనికి అనుకోని పరిస్థితులు ఎదురవుతాయి. వాటి పర్యవసానంగా కథ ఎలాంటి మలుపులు తిరిగింది అనేది ఆసక్తికరంగా చూపిస్తున్నాం. చింతామణి నాటక రిహార్సల్స్ సన్నివేశాలు ప్రత్యేకంగా రూపొందించాం. ఈ ఎపిసోడ్ అంతా ప్రేక్షకులను బాగా నవ్విస్తుంటుంది. అన్నారు

కథానాయకుడు సతీష్ రెడ్డి మాట్లాడుతూ.....నెల్లూరి పెద్దారెడ్డి అనే పాత్ర పేరు ప్రేక్షకులు వినే ఉంటారు. ఆ పెద్దారెడ్డి నవ్విస్తే....ఈ నెల్లూరి పెద్దారెడ్డి మీకు మర్చిపోలేని అనుభూతిని అందిస్తాడు. ఇంత గొప్ప పాత్రను నాకు ఇచ్చిన దర్శకులు వీజే రెడ్డి గారికి కృతజ్ఞతలు. ప్రణాళిక ప్రకారం కేవలం 28 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేశాం. అనుకున్న సమయానికే నిర్మాణాంతర కార్యక్రమాలు ముగించి...ఇప్పుడు మీ ముందుకు తీసుకొస్తున్నాం. 16న థియేటర్ లలో మిమ్మల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నాం. అన్నారు.

నెల్లూరి పెద్దారెడ్డి చిత్రానికి మాటలు - సంజీవ్ మేగోటి, సినిమాటోగ్రఫీ - బాలసుబ్రహ్మణి, ఎడిటింగ్ - మేనగ శీను, సంగీతం - గురురాజ్, డాన్స్ - గోరా మాస్టర్.

More News

'రాజరథం' లో 'చల్ చల్ గుర్రం' అంటూ వస్తున్న రవి శంకర్

'రాజరథం' నుండి ముచ్చటగా మూడో పాట 'చల్ చల్ గుర్రం' నేడు విడుదలైంది. చిత్రానికి పనిచేసే వారి ఆకట్టుకునే  నైపుణ్యం తో, ఉన్నత ప్రమాణాలతో ఆకర్షిస్తున్న 'రాజరథం' ఈ పాటతో  మరోసారి ఆశ్చర్యపరచనుంది.

అనుకిది గుర్తుండిపోయే సంవ‌త్స‌ర‌మే..

ఫ‌లితాల‌ సంగతి పక్కన పెడితే.. స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు చేస్తూ వార్త‌ల్లో నిలుస్తోంది కేర‌ళకుట్టి అను ఇమ్మాన్యుయేల్. 2016లో 'మజ్ను' సినిమాతో తెలుగు తెరకు పరిచయమయిన ఈ ముద్దుగుమ్మ‌.. 2017లో 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త', 'ఆక్సిజన్' సినిమాల్లో కథానాయికగా నటించింది.

శ‌ర్వానంద్ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్న సీనియ‌ర్ న‌టి

సూపర్ స్టార్ రజనీకాంత్ ప్ర‌త్యేక పాత్ర‌లో న‌టించిన 'విజయ' (త‌మిళంలో వ‌ల్లి) (1993)చిత్రంతో క‌థానాయిక‌గా పరిచయమయ్యారు ప్రియా రామన్. ఆ తర్వాత కమల్ హాసన్ ప్రధాన పాత్ర పోషించిన 'శుభ సంకల్పం' (1995), శోభన్ బాబు సరసన 'దొరబాబు' (1995) చిత్రాల్లో నటించారు.

'ఐతే 2.ఓ' ట్రైలర్‌ను విడుదల చేసిన మినిస్టర్‌ తలసాని శ్రీనివాస యాదవ్‌

ఇంద్రనీల్‌ సేన్‌గుప్తా, జారా షా, అభిషేక్‌, కర్తవ్య శర్మ, నీరజ్‌, మ ణాల్‌, మ దాంజలి కీలక పాత్రధారులుగా రాజ్‌ మాదిరాజు దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'ఐతే 2.ఓ'. ఫర్మ్‌ 9 పతాకంపై కె.విజయరామారాజు, హేమంత్‌ వల్లపురెడ్డి నిర్మిస్తున్నారు.

రామ్ సినిమా తోనూ కొన‌సాగించిన ద‌ర్శ‌కుడు

గ‌తేడాది విడుద‌లైన 'నేను లోకల్' సినిమాతో ద‌ర్శ‌కుడిగా మంచి విజ‌యాన్ని సొంతం చేసుకున్నారు త్రినాథరావు నక్కిన. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ డైరెక్ట‌ర్.. రామ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా తెరకెక్కుతున్న 'హలో గురు ప్రేమ కోసమే' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.