సుశాంత్ ఫ్యాన్ మెయిడ్ పోస్టర్‌కు నెటిజన్లు ఫిదా

  • IndiaGlitz, [Tuesday,June 23 2020]

నటుడు సుశాంత్ రాజ్‌పుత్ మరణాన్ని అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. కొందరు అభిమానులు ఆయన గురించే ఆలోచిస్తూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. సోషల్ మీడియాలో ఇప్పటికీ ఆయనను తలుస్తూ అభిమానులు పోస్టులు పెడుతూనే ఉన్నారు. దీనిలో భాగంగా అభిమానులు తయారు చేసిన ఓ పోస్టర్‌ను చూసిన అభిమానులు ఫిదా అవుతున్నారు. అంతేకాదు.. ఈ పోస్టర్ ఫిలింఫేర్‌ను సైతం ఆకర్షించింది. ఫిలింఫేర్ తన అఫీషియల్ ట్విటర్ అకౌంట్‌లో ఆ పోస్టర్‌ను పోస్ట్ చేసింది.

సుశాంత్‌కు తన కుక్క ఫడ్జ్‌తో ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తూ అభిమానులు ఆ పోస్టర్‌ను రూపొందించారు. అఖిల్ చేతి వేలిని అప్యాయంగా ఫడ్జ్ తడుముతున్నట్టుగా ఆ పోస్టర్‌ను సుశాంత్ అభిమానులు తయారు చేశారు. దీనిని ట్విటర్‌లో పోస్ట్ చేసిన ఫిలింఫేర్.. ‘బంధానికి ఎప్పుడూ మరణం ఉండదు. సుశాంత్ ఆయన పెంపుడు కుక్కకు మధ్య ఉన్న బంధాన్ని తెలియజేస్తూ ఓ అభిమాని రూపొందించిన అద్భుతమైన పోస్టర్ ఇది’ అని పేర్కొంది.

More News

'రెడ్‌ట్రీ' బ్రాండ్ పేరుతో మాస్క్‌లు తయారు చేయిస్తున్న లావణ్యా త్రిపాఠీ

కరోనా (కొవిడ్ 19) కాలంలో 'ఇంట్లో తయారు చేసిన మాస్క్‌లు' ధరించడం ఆరోగ్యానికి ఎంతో అవసరం.

వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్

శృంగవరపుకోట వైసీపీ ఎమ్మెల్యే శ్రీనివాసరావుకి కరోనా పాజిటివ్‌‌గా నిర్ధారణ అయింది. ఏపీలో కరోనా సోకిన తొలి ఎమ్మెల్యే ఆయనే కావడం గమనార్హం.

ఇంట్లోనే కరోనా చికిత్స అందించేందుకు ముందుకొచ్చిన ‘యశోదా’

కరోనా పాజిటివ్ అనగానే మనకు గుర్తొచ్చేది గాంధీ హాస్పిటల్. కానీ అక్కడ బెడ్స్ కొరతతో పాటు అంత మందికి చికిత్స అందించేందుకు సరిపడా వైద్య సిబ్బంది

అది నా డ్రీమ్ ప్రాజెక్ట్.. త్వరలోనే తెరకెక్కిస్తా: పూరి

ఇండస్ట్రీలోని డైనమిక్ డైరెక్టర్స్‌లో పూరి జగన్నాథ్ ఒకరు. తొలి సినిమా ‘బద్రి’తోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు.

ఏడాది చిన్నారికి ప్రాణదాతగా మారిన మహేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు ఏడాది పసివాడికి ప్రాణదాతగా మారాడు. చిన్నారి తల్లిదండ్రులు మహేష్‌కు, ఆంధ్రా హాస్పిటల్ యాజమాన్యానికి థాంక్స్ చెప్పారు.