'ఆర్ఆర్ఆర్‌' పోస్ట‌ర్ కాపీ కొట్టారంటూ ట్రోలింగ్‌...!

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి డైరెక్ష‌న్‌లో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా రూపొందుతోన్న మోస్ట్ అవెయిటెడ్ ప్యాన్ ఇండియా మూవీ 'ఆర్ఆర్ఆర్‌(రౌద్రం ర‌ణం రుధిరం)'. ఎప్పుడెప్పుడా అని ఎంటైర్ ఇండియ‌న్ మూవీ ఇండ‌స్ట్రీ ఎదురుచూస్తున్న ట్రిపులార్ సినిమాను తెలుగు, హిందీ, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో ఈ ఏడాది ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 13న విడుద‌ల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదలకు సంబంధించిన పోస్టర్‌ను కూడా విడుద‌ల చేశారు. గుర్రంపై రామ్‌చ‌ర‌ణ్‌, బుల్లెట్‌పై ఎన్టీఆర్ ఉన్న ఈ పోస్ట‌ర్‌పై ఇప్పుడు ట్రోలింగ్ మొద‌లైంది. జ‌క్క‌న్న ఈ పోస్ట‌ర్‌ను హాలీవుడ్ సినిమా నుంచి కాపీ కొట్టాడంటూ ట్రోలింగ్ మొద‌లు పెట్టారు.

హాలీవుడ్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న ఘోస్ట్ రైడ‌ర్ సినిమాలో ఓ యాక్ష‌న్ సీక్వెన్స్‌లో ఉండే స‌న్నివేశాన్ని రాజ‌మౌళి కాపీ కొట్టి పోస్ట‌ర్ రెడీ చేశాడంటూ ట్రోల్ చేయ‌డం మొద‌లుపెట్టారు. ఇలా ట్రోలింగ్ బారిన ప‌డ‌టం రాజ‌మౌళికి ఏమీ కొత్త కాదు.. బాహుబ‌లి సినిమాకు కూడా ఆయ‌న విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొన్న‌వాడే. అయితే త‌న మార్క్‌ను క్రియేట్ చేసి తెలుగు సినిమాను మ‌రో స్థాయికి తీసుకెళ్లాడు ద‌ర్శ‌క‌ధీరుడు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ విష‌యంలోనూ అదే జ‌రుగుతుందని రాజ‌మౌళి, తెలుగు సినీ అభిమానులు అంటున్నారు.

More News

ఎన‌ర్జీకి కేరాఫ్‌... మాస్ మ‌హారాజా ర‌వితేజ‌

మాస్ మహారాజా రవితేజ... డైలాగ్ డెలివరీ, సరికొత్త బాడీ లాంగ్వేజ్, తిరుగులేని ఎనర్జీ, డిఫరెంట్ చిత్రాలకే పక్కాకమర్షియల్ ఎంటర్ టైనర్స్‌కు కేరాఫ్ అడ్ర‌స్‌. సినీ రంగ ప‌రిశ్ర‌మ‌లో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా

తెలుగు రాష్ట్రాల్లో విరిసిన పద్మాలు.. ఆసక్తికర విషయాలివే

తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా నలుగురికి పద్మశ్రీ పురస్కారాలు లభించాయి. వీరిలో ఒకరు తెలంగాణకు చెందిన వారు కాగా.. ముగ్గురు ఏపీకి చెందిన వారు. కొమురంభీం జిల్లా జైనూరు మండలం మార్లవాయికి

మదనపల్లె ఘటన వెనుక విస్తుగొలిపే విషయాలు

చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఆదివారం జరిగిన అక్కాచెల్లెళ్ల జంట హత్య కేసు దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ కేసులో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అంతకు ముందు వారం రోజుల

షూటింగ్స్ సెట్స్‌లో సందడి చేస్తున్న పవన్, త్రివిక్రమ్.. వీడియో వైరల్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూడేళ్ల విరామానంతరం మళ్లీ సినిమాలతో బిజీ అయ్యారు. ఇటీవలే ‘వకీల్ సాబ్’ షూటింగ్‌ను పూర్తి చేసిన పవర్‌స్టార్ మరో రెండు సినిమాలను పట్టాలెక్కించిన పెట్టిన విషయం తెలిసిందే.

పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం.. బాలుకు పద్మవిభూషణ్

తాజాగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. 72వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని.. 2021కి గాను పద్మ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది.