close
Choose your channels

లారెన్స్‌ 'లక్ష్మీబాంబ్‌'కు కొత్త సమస్య

Wednesday, October 21, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

లారెన్స్‌ లక్ష్మీబాంబ్‌కు కొత్త సమస్య

రాఘవ లారెన్స్‌ బాలీవుడ్‌ డెబ్యూ మూవీ 'లక్ష్మీబాంబ్‌'ను ఏ ముమూర్తాన స్టార్ట్‌ చేశారో కానీ.. సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. షూటింగ్‌ సమయంలో లారెన్స్‌ ఏదో సమస్యతో ప్రాజెక్టును వీడిపోతానని చెప్పాడు. అయితే హీరో అక్షయ్‌ కుమార్‌ కలుగచేసుకుని గొడవలను సర్దుబాటు చేశాడు. సినిమాను ఈ ఏడాది మే నెలలో విడుదల చేయాలని అనుకోగానే, కరోనా ప్రభావం ప్రారంభం కావడంతో థియేటర్స్ మూతపడ్డాయి. దీంతో నిర్మాతలు ఏం చేయలేక సినిమాను ఓటీటీలో విడుదల చేయడానికి నిర్ణయించుకున్నారు. నవంబర్‌ 9న సినిమాను ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. రీసెంట్‌గా విడుదలైన ట్రైలర్‌కు కూడా చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది.

ఇక సినిమా స్ట్రీమింగ్‌కు కొన్ని రోజులే ఉన్నాయనుకునే సందర్భంలో ఇప్పుడొక కొత్త సమస్య వచ్చిపడింది. 'లక్ష్మీబాంబ్‌' లవ్‌ జీహాదీని ప్రోత్సహించే విధంగా ఉందని హిందూ సంఘాలు ఆరోపణలు చేస్తున్నాయి. వివరాల్లోకెళ్తే.. హిందూసేన అధ్యక్షుడు లక్ష్మీబాంబ్‌ లవ్‌ జీహాదీకి మద్దతుని తెలియజేసేలా ఉందని కాబట్టి తమ సంస్థ తరపున 'లక్ష్మీబాంబ్‌'పై ఫిర్యాదు చేయబోతున్నట్లు ప్రకటించారు. మరి ఈ వ్యవహారంపై దర్శక నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాలి. రాఘవ లారెన్స్‌ తమిళంలో తెరకెక్కించిన చిత్రం 'కాంచన'కు రీమేక్‌గా రూపొందిన చిత్రమే 'లక్ష్మీబాంబ్‌'. రీమేక్‌లో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.