సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో న్యూ ట్విస్ట్..

  • IndiaGlitz, [Wednesday,September 09 2020]

టీవీ సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్ ఒకటి వెలుగు చూసింది. ఆమె తల్లి .. టిక్‌టాక్ ద్వారా పరిచయమైన దేవరాజురెడ్డి అనే యువకుడి వేధింపుల కారణంగానే తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే సదరు దేవరాజు రెడ్డి తాను పోలీసుల ఎదుట లొంగిపోయేందుకు సిద్ధమని వెల్లడించాడు. శ్రావణి కాల్ రికార్డింగ్స్ అన్నీ కూడా పోలీసుల ముందు ఉంచుతానని స్పష్టం చేశాడు. తన ముందే సాయి అనే వ్యక్తి తనను పెళ్లి చేసుకోవాలని శ్రావణిపై ఒత్తిడి తెచ్చాడని.. పెళ్లి చేసుకోకపోతే చంపేస్తాడనే భయంతోనే శ్రావణి ఆత్మహత్యకు పాల్పడిందని దేవరాజు చెబుతున్నాడు.

శ్రావణి తన తల్లిదండ్రుల ఒత్తిడితోనే తనపై కేసు పెట్టిందని దేవరాజు తెలిపాడు. ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్‌లో తనను వివాహం చేసుకోవాలని అడిగిందని.. తాను ఒప్పుకోలేదన్న కోపంతోనే తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని దేవరాజు చెప్పుకొచ్చాడు. తనపై పెట్టిన కేసులను సైతం వెనక్కి తీసుకుంటానని శ్రావణి తనకు చెప్పిందని దేవరాజు వెల్లడించాడు. అయితే శ్రావణి ఆత్మహత్యపై ఆమె అక్కాబావ స్పందించారు. శ్రావణిని దేవరాజురెడ్డి సీరియల్స్‌లో అవకాశం ఇప్పించాలని కోరితే ఆమె ఇప్పించిందని వెల్లడించారు. ఆ పరిచయంతోనే శ్రావణిని దేవరాజు బ్లాక్ మెయిల్ చేసేవాడని చెప్పుకొచ్చారు.

కాగా.. శ్రావణి మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల మధుర నగర్ హెచ్ 56 బ్లాక్ రెండవ ఫ్లోర్‌లో బాత్‌రూమ్‌లో శ్రావణి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బాత్‌రూమ్‌లో నుంచి ఎంతకూ బయటకు రాకపోవడంతో అనుమానించిన కుటుంబ సభ్యులు డోర్ పగులగొట్టుకుని లోపలికి వెళ్లేసరికే ఆమె విగతజీవిగా పడి ఉంది. వెంటనే శ్రావణిని కుటుంబ సభ్యులు యశోద హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు తేల్చారు.

More News

ఆ రీమేక్‌లో శ్రియా శ‌ర‌న్ న‌టిస్తుందా..?

నితిన్ హీరోగా బాలీవుడ్ సూప‌ర్‌హిట్ మూవీ ‘అంధాదున్’ రీమేక్ సినిమా రీమేక్ చేయ‌డానికి ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే.

రెఫరెండం పెడితే 3 ప్రాంతాల ప్రజలు మాతో ఏకీభవిస్తారు: జగన్

ఏపీ సీఎం జగన్ అమరావతిపై కక్ష పెంచుకున్నారంటూ వస్తున్న ఆరోపణలో ఓ ఇంటర్వ్యూలో ఆయన స్పందించారు.

కంగ‌నా సీఎం అయ్యేలా ఉంది: వ‌ర్మ‌

వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ న‌టి కంగ‌నా ర‌నౌత్‌ను ఉద్దేశించి పెద్ద ట్వీటే చేశాడు.

నా డెస్టెనీ వేరేలా ఉందని అప్పుడు తెలిసింది: రేణు దేశాయ్

1995లో ఇదే రోజున తాను కెమెరాను ఫేస్ చేశానని ప్రముఖ నటి, నిర్మాత రేణు దేశాయ్ వెల్లడించారు.

'బొమ్మ బ్లాక్ బస్టర్' చిత్రం నుండి రష్మీ ఫస్ట్ లుక్

యంగ్ టాలెంటెడ్ హీరో నందు, డ‌స్కీ బ్యూటీ ర‌ష్మీ గౌత‌మ్ జంట‌గా విజ‌యీభ‌వ ఆర్ట్స్ ప‌తాకం పై