Nihar Kapoor:జయసుధ వారసుడు.. 'రికార్డ్ బ్రేక్' హీరో నిహార్ కపూర్ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ..

  • IndiaGlitz, [Monday,March 04 2024]

అలనాటి హీరోయిన్ జయసుధ వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన నిహార్ కపూర’ హీరోగా 'రికార్డ్ బ్రేక్' అనే సినిమాలో నటించారు. చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా తెరెకెక్కిన ఈ మూవీ మార్చ్ 8న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిహార్ మీడియాతో ముచ్చటిస్తూ సినిమా గురించి ఎన్నో విషయాలు పంచుకున్నారు.

ఈ సినిమా మీకు అప్రోచ్ అయినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి ఈ సినిమా ఒప్పుకోవడానికి గల కారణం ఏంటి?

నేను ముందు గ్యాంగ్ స్టర్ గంగరాజు సినిమా చేశాను. ఆ సినిమా చేస్తున్న సందర్భంలో చదలవాడ శ్రీనివాసరావు గారు చాలా బాగా చేసావు ఒక కథ ఉంది ఆ కథకు నువ్వు యాప్ట్ అవుతావు అని చెప్పారు. కథ వినగానే చాలా ఎక్సైటింగ్ గా అనిపించి చేస్తానని ఒప్పుకున్నాను. హీరోగా అని కాకుండా క్యారెక్టర్రైజేషన్ చాలా బాగుండడంతో ఈ కథ ఒప్పుకున్నాను.

చదలవాడ శ్రీనివాసరావు గారి లాంటి డైరెక్టర్ ఈ సినిమా చేస్తున్నారంటే కొత్తదనం ఏం చూపిస్తున్నారు?

యాక్షన్ సీక్వెన్సెస్ జాషువా గారు చేస్తున్నారు ఆయన చేసిన ప్రతి యాక్షన్ ఎపిసోడ్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. చదలవాడ శ్రీనివాసరావు గారు ఎక్స్పీరియన్స్ రెండు విజన్ అదేవిధంగా జాషువా గారి యాక్షన్ సీక్వెన్సెస్ సినిమా కి చాలా ప్లస్ అవుతాయి. అదేవిధంగా ఈ సినిమాలో హీరోయిన్ కన్నా క్యారెక్టర్రైజేషన్స్ని ఎక్కువగా చూపిస్తారు.

చదలవాడ శ్రీనివాసరావు గారు మొదటి సినిమా తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకుని ఈ సినిమా డైరెక్ట్ చేశారు? ఆయన డైరెక్షన్ ఎలా అనిపించింది?

ఆయనకు సినిమాలంటే పాషన్. ఈ కథని జనాలకి చెప్పాలనుకుంటున్నారు. ఆయన ఒక సోషల్ సబ్జెక్ట్ ని సోషల్ కాన్సెప్ట్ ని తీసుకునే సినిమాలు చేస్తారు. ఇది కూడా అలాంటి ఒక మంచి కాన్సెప్ట్. ఇది పూర్తిగా దేశభక్తి సినిమా.

మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది?

ఇద్దరు అనాధలు అడవిలో పెరుగుతూ ఉంటాం. మేము ట్విన్స్. అడవి నుంచి కుస్తీ పోటీలు నేర్చుకుని సిటీకి వచ్చి ఇంటర్నేషనల్ లెవెల్ లో డబ్ల్యూ డబ్ల్యూ ఈ దాకా వెళ్లడం ఆ ప్రయాణాన్ని చాలా బాగా చూపించారు.

వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేస్తున్నారు కదా ఈ కాన్సెప్ట్ ప్రజెంట్ ఉన్న జనరేషన్ కి ఎలా రెలవెంట్ గా ఉంటుంది?

ఇందులో డబ్ల్యూ డబ్ల్యూ పోటీలు చూపిస్తున్నాము. కుస్తీ పోటీల నుంచి డబ్ల్యు డబ్ల్యు ఈ దాకా జరిగే ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉంటుంది అనేది మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది. రాజస్థాన్ హర్యానా లాంటి ప్రాంతాల్లో కుస్తీ పోటీలు ఎక్కువగా జరుగుతాయి ఆ డీటైలింగ్ మీద నార్త్ వాళ్ళు ఎక్కువ సినిమాలు తీస్తారు. కానీ మన సినిమాలో కుస్తీ పోటీలతో పాటు మిగతా ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. ఇది తెలుగు సినిమా అయినా ప్రతి భారతీయుడు చూసి గర్వించదగ్గ సినిమా. ఇలాంటి సినిమా తెలుగుతోనే ఆగిపోకూడదు. అందుకే ఎనిమిది భాషల్లో వరల్డ్ వైడ్‌గా సినిమా రిలీజ్ చేస్తున్నాం.

మిగతా లాంగ్వేజెస్‌లో ఎలా ప్రమోట్ చేయబోతున్నారు?

రీసెంట్ గా కన్నడ చెన్నై వెళ్లి అక్కడ ప్రమోట్ చేయడం జరిగింది. కన్నడలో రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది. ముంబైలో కూడా ఇలాంటి కథలు ఎక్కువగా చూస్తారు అక్కడ కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇంకా మలయాళం ఒడియాలో కూడా నెక్స్ట్ ప్రమోట్ చేస్తున్నాము.

గతంలో దంగల్ లాంటి కమర్షియల్ సినిమాలు ఇలాంటి కథతోనే వచ్చే దానికి దీనికి డిఫరెన్స్ ఎలా ఉండబోతుంది?

ఇది కూడా కమర్షియల్ సినిమా నే. దంగల్ తో కంపారిజన్ ఉండదు. అందులో కుస్తీ పోటీలు ఇవన్నీ డీటెయిల్ గా ఉంటాయి. ఇందులో కుస్తీ పోటీల గురించి చెబుతూ ఇద్దరు అనాధల జర్నీ ఇంటర్నేషనల్ లెవెల్ దాకా వెళ్ళింది అలాగే సెంటిమెంట్ ఎమోషనల్ అన్ని కలగలిపిన ఒక కమర్షియల్ సినిమాగా ఉంటుంది. మంచి మదర్ సెంటిమెంట్ సాంగ్స్ ఫైట్స్ అన్ని ఎలిమెంట్స్ సినిమాలో ఉంటాయి.

ట్రైలర్ చూసి మీ మదర్ జయసుధ గారు రియాక్షన్ ఏంటి?

ట్రైలర్ చూస్తారు అదే విధంగా సినిమాని కొంత చూశారు చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. మళ్లీ ఒకసారి ఫుల్ సినిమా చూసిన తర్వాత ఏం చెప్తారు అనేది నేను వెయిట్ చేస్తున్నాను. ట్రైలర్ అయితే జయసుధ గారికి చాలా నచ్చింది. అమ్మ బిజీగా ఉన్నారు కథ నేనే విని ఒకే చేశా యూనిక్ కాన్సెప్ట్ తీసుకున్నావ్ అని చెప్పి చాలా మెచ్చుకున్నారు.

ఇకనుంచి మీరు కంటిన్యూ గా సినిమాలు చేస్తుంటారా?

కచ్చితంగా కంటిన్యూగా ఇంక సినిమాలు చేస్తూ ఉంటాను.

డైరెక్షన్ కోర్స్ నేర్చుకున్నారు కదా ఫ్యూచర్లో డైరెక్షన్ చేసే ఛాన్స్ ఉందా?

కచ్చితంగా డైరెక్షన్ చేస్తాను కాకపోతే దానికి కొంచెం టైం ఉంది. స్క్రిప్స్ రాసుకున్నాను ఓటీటీ కి ఫ్యూచర్ ఫిలిం కి రెండిటికి ట్రై చేస్తున్నాను. టైం సెట్ అయితే కచ్చితంగా చేస్తాను.

More News

Chandrababu:వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..

వాలంటీర్లు వైసీపీ కోసం మాత్రం పనిచేయవద్దని టీడీపీ అధినేత చంద్రబాబు సూచించారు. అనంతపురం జిల్లా పెనుకొండలో నిర్వహించిన 'రా కదలిరా' సభలో చంద్రబాబు పాల్గొన్నారు.

BRS Party: నాలుగు స్థానాలకు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు ఖరారు.. ఎవరంటే..?

గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇప్పుడిప్పుడే పార్టీపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దృష్టిపెడుతున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలిచేలా వ్యూహాలు రచిస్తు్న్నారు.

తాకట్టులో సచివాలయం వార్త పూర్తి అవాస్తవం: APCRDA

యెల్లో మీడియా ప్రచారం చేస్తున్న "తాకట్టులో సచివాలయం" వార్త పూర్తి అవాస్తవమని ఏపీసీఆర్డీఏ(APCRDA) తెలిపింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. "సచివాలయం తాకట్టు వార్త అవాస్తవం.

OTT:ఈ వారం ఓటీటీలోకి అదిరిపోయే సినిమాలు.. హనుమాన్‌ కూడా..

ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓటీటీల్లో అలరించేందుకు సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు సిద్ధమయ్యాయి.

Prashant Kishore:ప్రశాంత్ కిషోర్ కల్లబొల్లి మాటలు.. యెల్లో మీడియా రాతలు..

ఐప్యాక్ సంస్థ వ్యవస్థాపకుడిగా ప్రశాంత్ కిషోర్ గతంలో కొన్ని పార్టీల తరపున పనిచేసిన సంగతి తెలిసిందే.