మెగా డాటర్ నిశ్చితార్థం.. ఆ లోటు మాత్రం కనిపించింది..

మెగా డాటర్ నిహారిక నిశ్చితార్థం జొన్నలగడ్డ చైతన్యతో వైభవంగా జరిగింది. గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకర్ రావు కుమారుడైన చైతన్యతో నిహారిక వివాహం ఇటీవలే ఖాయమైన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవికి ప్రభాకర్‌రావు అత్యంత సన్నిహితుడవడంతో అంతా తానై నిహారిక, చైతన్యల వివాహాన్ని ఖాయం చేశారు. కాగా.. గురువారం హైదరాబాద్‌లో ఇరు కుటుంబాల మధ్య వైభవంగా నిశ్చితార్థ వేడుక జరిగింది. కాగా ఈ వేడుకకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాత్రం హాజరు కాలేదు.

కరోనా నేపథ్యంలో ప్రభుత్వం విధించిన నిబంధనలను పాటిస్తూ.. ఇరు కుటుంబాల వారూ ఈ నిశ్చితార్థ వేడుకను జరిపించారు. మెగా హీరోలతో నిశ్చితార్థ వేడుక కళకళలాడింది. మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, కల్యాణ్ దేవ్ వంటి వారందరూ ఈ మెగా వేడుకలో సందడి చేశారు. అయితే పవన్ లేని లోటు మాత్రం కనిపించింది.

ఈ నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. సింపుల్‌గా జరిగిన ఈ వేడుక మాదిరిగానే వివాహం కూడా జరగనున్నట్టు తెలుస్తోంది. నిహారిక పెళ్లిని.. పబ్లిక్ పండుగలా కాకుండా పర్సనల్‌గానే ట్రీట్ చేస్తున్నామని నాగబాబు ఇప్పటికే తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో వైభవంగా వివాహం నిర్వహించలేమని.. ఆయన తెలిపారు. దీంతో పెళ్లి కూడా సింపుల్‌గానే జరగనుందని తెలుస్తోంది.

More News

వచ్చేసింది.. త్వరలో వస్తా.. ప్లాస్మా ఇస్తా: అజయ్ భూపతి

టాలీవుడ్‌ని కరోనా మహమ్మారి వదిలేలా లేదు. ఇటీవల కరోనా కారణంగా తరచూ తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు వార్తల్లో నిలుస్తున్నారు.

ఏపీలో ఆగని కరోనా విజృంభణ.. నేడు పాజిటివ్ కేసులకు సమానంగా..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు ఏమాత్రం తగ్గడం లేదు. కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది.

ఎమ్మెల్యే అచ్చెన్నాయుడికి కరోనా పాజిటివ్..

ఏపీలో కరోనా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి రాష్ట్రంలో అన్ని జిల్లాలకూ విస్తరించింది.

ఏ కులాన్ని తక్కువ చేసి చూపించట్లేదు: ‘జాంబీ రెడ్డి’ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ

జాతీయ అవార్డు పొందిన 'అ!' చిత్ర‌ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ ‘కల్కి తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని త‌న మూడో సినిమాను రూపొందిస్తున్నారు.

రామ జన్మభూమి ట్రస్ట్ అధ్యక్షుడికి కరోనా పాజిటివ్..

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం ఏర్పాటైన రామ‌ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధ్యక్షుడు నృత్య గోపాల్ దాస్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.