త‌మిళ హీరోతో మెగాడాట‌ర్‌

  • IndiaGlitz, [Monday,May 04 2020]

మెగా బ్ర‌ద‌ర్ త‌న‌య నిహారిక కొణిదెల ఒక మ‌న‌సు సినిమాతో హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మైంది. ఈమె చేసిన సూర్య‌కాంతం, అంత‌కు ముందే విజ‌య్ సేతుప‌తి, గౌత‌మ్ కార్తీక్‌ల‌తో ఓ త‌మిళ సినిమాలో న‌టించింది నిహారిక‌. అయితే హీరోయిన్‌గా ఈ అమ్మ‌డుకి స‌క్సెస్ ద‌క్కలేదు. సైరా న‌ర‌సింహారెడ్డిలో ఓ చిన్న పాత్ర‌లో క‌నిపించింది. దాదాపు ఏడాది త‌ర్వాత హీరోయిన్‌గా సినిమాను ఓకే చేసింది నిహారిక‌. ఈ విష‌యాన్ని ఆమె స్వ‌యంగా త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేసింది. అశోక్ సెల్వ‌న్ క‌థానాయ‌కుడిగా ఈ సినిమా రూపొంద‌నుంది. కెన‌న్య ఫిలింస్ బ్యాన‌ర్‌పై స్వాతిని ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా సినిమా రూపొంద‌నుంది. తాను ఎంతో ఆస‌క్తిగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నాన‌ని కూడా నిహారిక తెలియ‌జేసింది.

క్వారంటైన్ స‌మ‌యంలో నిహారిక కొణిదెల సోష‌ల్ మీడియాలో ఫుల్ బిజీగా ఉంది. త‌న‌కు సంబంధించిన వీడియోలు, ఫొటోల‌ను అప్‌లోడ్ చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లోనూ చాటింగ్ చేశారు. రామ్‌చ‌ర‌ణ్ చెల్లెలుగా ఆచార్య సినిమాలో కనిపించ‌బోతున్నాన‌నే వార్త‌ల‌పై నిహారిక స్పందించారు. తాను చ‌ర‌ణ్ అన్న‌య్య‌తో క‌లిసి చేయ‌డం లేద‌ని, అవ‌న్నీ పుకార్లేన‌ని చెప్పేశారు.

More News

తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరిగిపోతున్నాయ్!

కరోనా మహమ్మారి నుంచి తెలంగాణ బయటపడినట్లే అని గత వారం రోజులుగా అనిపించినప్పటికీ.. రెండు మూడ్రోజులుగా కేసులను బట్టి చూస్తే మళ్లీ విజృంభిస్తోందని చెప్పుకోవచ్చు.

మందు బాబులకు జగన్ సర్కార్ భారీ షాక్

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే రెండు సార్లు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ పొడిగించిన కేంద్రం ప్రభుత్వం.. తాజాగా మరోసారి 3.0 పేరుతో మే-17వరకు పొడిగించిన సంగతి తెలిసిందే.

ఏపీకి మరో ముప్పు.. దూసుకొస్తున్న భారీ తుఫాన్!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో విలయతాండవం చేస్తుండగా.. తాజాగా రాష్ట్రానికి మరో ముప్పు రాబోతోంది. ఏపీకి భారీ తుఫాన్ ముప్

బన్నీ 'పుష్ప'లో 6కోట్లతో భారీ యాక్షన్ సీన్!

టాలీవుడ్ స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ అలియాస్ బన్నీ.. క్రియేటివ్‌ హెడ్‌గా పేరుగాంచిన సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. ఇప్పటికే బన్నీ బర్త్‌డే సందర్భంగా టైటిల్, ఫస్ట్‌లుక్‌ను

రాజ‌మౌళికి రామాయ‌ణం చేయాలంటూ నెటిజ‌న్స్ రిక్వెస్ట్‌

ఓ సాధార‌ణ స‌న్నివేశాన్ని బ‌ల‌మైన ఎమోష‌న్స్‌, రోమాలు నిక్క‌బొడుచుకునే యాక్ష‌న్‌, అద్భుత‌మైన విజువ‌ల్స్‌తో తెర‌కెక్కించే ద‌ర్శ‌కుల్లో దర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ముందు వ‌రుస‌లో ఉంటారు.