కరోనా కాదు.. ఏదొచ్చినా పెళ్లి చేసుకుంటా!

  • IndiaGlitz, [Monday,March 16 2020]

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్.. భీమవరం అమ్మాయి డాక్టర్ పల్లివిని పెళ్లాడబోతున్నాడు. అయితే ప్రపంచాన్ని కరోనా మహామ్మరి వణికిస్తున్న నేపథ్యంలో ఎవరూ ఎలాంటి శుభకార్యాలకు గానీ.. కనీసం జనాల్లో తిరగాలంటేనే జంకుతున్నారు. ఈ క్రమంలో ఎన్నో పెళ్లిల్లు పోస్ట్ పోన్ అయ్యాయి. అంతేకాదు టాలీవుడ్‌లో అన్ని షూటింగ్స్, సినిమా రిలీజ్‌లను సైతం బంద్ చేయడం జరిగింది. ఈ క్రమంలో యంగ్ హీరోలు నితిన్, నిఖిల్‌ పెళ్లిళ్లపై కూడా కరోనా ప్రభావం పడిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. తాజాగా.. ఈ వదంతులపై నిఖిల్ స్పందించాడు. కరోనా కారణంగా తన పెళ్లి వాయిదా పడిందనే వార్తలను తీవ్రంగా ఖండించాడు.

క్లారిటీ ఇచ్చేసిన నిఖిల్..
ఏప్రిల్‌లో పరిస్థితి ఎలా ఉన్నా సరే తన పెళ్లి మాత్రం వాయిదే ప్రసక్తే లేదన్నాడు. పెళ్లికిగాను ఇప్పటికే కన్వెన్షన్ హాల్‌‌ను అడ్వాన్స్‌గా బుక్ చేసుకొన్నామని.. రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేమన్నాడు. ఆహ్వాన పత్రికలు కూడా బంధువులకు పంపిస్తున్నామని.. ఏది వచ్చినా పెళ్లి మాత్రం ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశాడు. ‘ముందుగా నిర్ణయించిన ప్రకారమే నా పెళ్లి జరుగుతుంది. నా పెళ్లిపై ఆందోళన అక్కర్లేదు. కరోనానే కాదు.. ఏదొచ్చినా మా పెళ్లి కచ్చితంగా జరగుతుంది. వాయిదా వేసుకునే ప్రసక్తే లేదు. ఒకవేళ విపత్కర పరిస్థితులు వస్తే గుళ్లో అయినా సరే పెళ్లి చేసేసుకుంటాం. తప్పుడు సమాచారాన్ని ఎవరూ నమ్మవద్దు’ అని నిఖిల్ క్లారిటీ ఇచ్చేశాడు.

కాగా.. గత కొన్నేళ్లుగా ప్రేమలో మునిగి తేలిన నిఖిల్-పల్లవి పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకుంటున్నారు. గోవాలో అమ్మాయిని ఒప్పించిన నిఖిల్ అక్కడే నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు. ఫిబ్రవరి-01న పెద్దల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్న ఆయన.. ఏప్రిల్-16న పెళ్లాడబోతున్నాడు. కాగా.. ఇటీవలే ‘అర్జున్ సురవరం’ లాంటి బ్లాక్ బస్టర్ మూవీతో ఊపు మీద ఉన్న హీరో నిఖిల్ త్వరలోనే ఓ ఇంటివాడవుతున్నాడు.

More News

‘అల వైకుంఠపురములో..’ డెలిటెడ్ సీన్.. ‘అర్జున్ రెడ్డి-2’!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అలియాస్ బ‌న్నీ హీరోగా న‌టించిన ‘అల‌..వైకుంఠ‌పుర‌ములో’ సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

విదేశాల నుంచి వచ్చినవారికి జగన్ సర్కార్ స్ట్రాంగ్ వార్నింగ్

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఏపీలో జగన్ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది.

తెలంగాణ కరోనాపై తప్పుడు ప్రచారాలు చేస్తే కేసులే..: ఈటల

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ భారీన పడి వందల సంఖ్యలో చనిపోగా..

షాకింగ్ రోల్‌లో ప‌వ‌న్‌క‌ల్యాణ్‌?

ప‌వ‌న్‌క‌ల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత ఏక‌ధాటిగా సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తున్నాడు.

అల్లు అయాన్ అభిమాన హీరో ఎవ‌రో తెలుసా?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త‌న‌యుడు అల్లు అయాన్ బాలీవుడ్ యాక్ష‌న్ స్టార్ టైగ‌ర్ ష్రాఫ్‌కు పెద్ద అభిమానట‌.