వైఎస్ జగన్‌ను కలిసిన నిఖిల్.. రాజకీయాల్లో చర్చ!

  • IndiaGlitz, [Tuesday,June 11 2019]

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని మాజీ ప్ర‌ధాని దేవెగౌడ మ‌న‌వ‌డు, క‌ర్నాట‌క ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి కుమారుడు నిఖిల్ గౌడ క‌లిశారు. మంగళవారం మధ్యాహ్నం తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో నిఖిల్ మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సందర్భంగా ఏపీ ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డం ప‌ట్ల నిఖిల్ అభినంద‌న‌లు తెలిపారు.

కాగా.. ఇటీవల కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో మాండ్యా నుంచి పోటీచేసిన నిఖిల్.. సుమలత చేతిలో ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. సుమలత కనివినీ ఎరుగని రీతిలో 703,660 ఓట్లు దక్కించుకుని అనగా.. 51% శాతంతో గెలుపొందారు. అయితే ఈ ఎన్నికల్లో తెలుగింటి ఆడపడుచు సుమలతను ఓడించి నిఖిల్‌ను గెలిపించాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాండ్యాలో ప్రచారం చేసిన విషయం తెలిసిందే. అయితే చంద్రబాబును కలవకుండా.. వైఎస్ జగన్‌ను నిఖిల్ కలవడంతో అటు కర్ణాటక.. ఇటు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

More News

ఐదు రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. రివెంజ్ ఉంటుందా!?

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి.

ఏపీ సెక్రటేరియట్‌‌కు కత్తి మహేశ్ ఎందుకెళ్లినట్లు!?

టాలీవుడ్‌లో వివాదాలకు మారుపేరుగా ఉన్న సినీ క్రిటిక్ కత్తి మహేశ్ ఉన్నట్టుండి ఏపీ సెక్రటేరియట్‌లో ప్రత్యక్షమయ్యాడు.

రోజా, అంబటి, ఆళ్లకు త్వరలో కీలక బాధ్యతలు!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేబినెట్‌లో మంత్రి పదవులు ఆశించి.. చివరి నిమిషం వరకు పక్కా అనుకుని దక్కించుకోలేకపోయిన వారిలో రోజా, అంబటి రాంబాబు

జూన్ 28న విడుద‌ల‌వుతున్న‌ శ్రీవిష్ణు, నివేథా థామ‌స్ 'బ్రోచేవారెవ‌రురా'

శ్రీవిష్ణు, నివేదా థామ‌స్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం `బ్రోచేవారెవ‌రురా`. ఈ చిత్రం జూన్ 28న విడుద‌ల కానుంది.

అయ్యో.. రోజా కంటే ముందే ‘ఆమె’కు కీలక పదవి!?

అవును.. మీరు వింటున్నది నిజమే ‘ఆమె’కు కీలక పదవి ఇచ్చి గౌరవించాలని ముఖ్యమంత్రి జగన్ ఫిక్స్ అయ్యారట.